GST On Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్ను.. జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST On Online Gaming: మనం వాడే దాదాపు అన్ని వస్తువులపై పన్నును విధిస్తున్నారు. వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) పేరుతో పన్నును విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జీఎస్టీ కేంద్రం(సెంట్రల్)తోపాటు స్టేట్(రాష్ట్రం) కూడా పన్ను రూపంలో విధిస్తున్నాయి. వీటికి తోడు ఇకపై ఆన్లైన్ గేమింగ్పై కూడా పన్ను విధించనున్నారు. ఆన్లైన్ క్రీడలపై పన్ను విధించడానికి సంబంధించిన సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీంతో ఆన్గేమింగ్పై ఇక జీఎస్టీని విధించనున్నారు. ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్నుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ (GST council) సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు.
Read also: Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
Also Read
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు మరియు క్యాసినోలలో బెట్టింగ్ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017కి సవరణలు కోరుతూ శుక్రవారం లోక్సభ బిల్లును ఆమోదించింది. లోక్సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు అధిర్ రంజన్ చౌదరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్సభలో విపక్షాల నిరసనల మధ్య కేంద్రం వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023లకు లోక్సభ ఆమోదం తెలిపింది.
నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకురావాలనుకున్న బిల్లులను అన్నింటిని పార్లమెంటులో ప్రవేశపెట్టినట్టు అయింది. ఇప్పటికే కీలక బిల్లులను ఆమోదించుకున్న కేంద్రం.. వర్షాకాల సమావేశాల చివరి రోజు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చింది. రాజ్యసభలో కూడా జీఎస్టీ సవరణ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రాల శాసనసభలు కూడా GST చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జీఎస్టీ ఎంత అనేది స్పష్టం అవుతుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!