Stock Market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- రుచించని ఆర్బీఐ పాలసీ
- నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వారం ముగింపులో నష్టాలతో క్లోజ్ అయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటనకు ముందే సూచీల్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తతతో సూచీల్లో లాభ, నష్టాలతో ఊగిసలాట సాగింది. ఆర్బీఐ గవర్నర్.. రెపో రేటును యథాతథంగా ఉంచినట్లు ప్రకటించినా.. సూచీల్లో మాత్రం మార్పు కనిపించలేదు. చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 56 పాయింట్లు నష్టపోయి 81, 709 దగ్గర ముగియగా.. నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 24, 677 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.84.69 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ భారీ లాభాలతో కొనసాగగా.. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. సెక్టోరల్లో ఐటీ, మీడియా మినహా మిగిలిన అన్ని సూచీలు ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ, టెలికాం, పీఎస్యూ బ్యాంక్ 0.3-1 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం దగ్గర కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి కావడం విశేషం. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.
రెపో రేటులో ఎటువంటి మార్పు లేదని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతం అంచనా వేసిన దానికంటే చాలా తక్కువగా నమోదైందని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. తయారీ కంపెనీల పనితీరు బలహీనంగా ఉండటం, మైనింగ్ కార్యకలాపాలు క్షీణించడం, విద్యుత్కు డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల వృద్ధి ఈ క్షీణతకు కారణమని ఆయన చెప్పారు. పారిశ్రామిక కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని, అంతకుముందు త్రైమాసికంలో కనిష్ట స్థాయి నుంచి కోలుకుంటుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!