Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వారం ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభం కావడంతోనే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా క్షీణతను నమోదు చేస్తూ ట్రేడింగ్ను కొనసాగిస్తోంది.
చెల్లాచెదురైన దిగ్గజ షేర్లు
మార్కెట్లలో నెలకొన్న ఈ భారీ క్షీణత కారణంగా అగ్రశ్రేణి కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా.. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడమే మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
- Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
అమెరికా – ఇరాన్ మధ్య కొత్త యుద్ధ భయం
అమెరికా – ఇరాన్ మధ్య మళ్లీ కొత్త యుద్ధం వస్తుందనే భయమే స్టాక్ మార్కెట్ పతనానికి అతిపెద్ద కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరిక జారీ చేశారు. ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాజాగా ఆయన ఒక పోస్ట్లో ఆయన ఇలా పేర్కొన్నారు.. “ఇరాన్కు ఇచ్చిన గడువు వేగంగా గడిచిపోతోంది, వారు వీలైనంత త్వరగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే వారికి ఏమీ మిగలదు. సమయం చాలా విలువైనది” అంటూ రాసుకొచ్చారు.
ట్రంప్ బెదిరింపులు – హోర్ముజ్ జలసంధి విషయంలో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపించాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు $112కు చేరుకోగా, WTI ముడి చమురు ధరలు బ్యారెల్కు $108 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా సహజ వాయువు ధరలు కూడా సుమారు 3 శాతం పెరిగి, $3.034కు చేరుకున్నాయి.
విదేశాల నుంచి రెడ్ సిగ్నల్స్..
ఇండియన్ స్టాక్ మార్కెట్ పతనానికి విదేశీ మార్కెట్ల నుంచి రెడ్ సిగ్నల్స్ అందడం కూడా ఒక కారణం అని చెబుతున్నారు. గిఫ్ట్ నిఫై 195 పాయింట్లు పడిపోయి 23,550 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఆసియా మార్కెట్లలో కూడా ప్రకంపనలు కనిపించాయి. జపాన్ నిక్కీ సుమారు 600 పాయింట్లు పడిపోగా, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ కూడా 385 పాయింట్లు తగ్గింది. బ్రిటన్ మార్కెట్ FTSE-100 కూడా సుమారు 200 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది. వీటితో పాటు, DAX (510 పాయింట్లు), CAC (150 పాయింట్లు) కూడా క్షీణతలో ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!