Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వారం ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభం కావడంతోనే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా క్షీణతను నమోదు చేస్తూ ట్రేడింగ్ను కొనసాగిస్తోంది.
చెల్లాచెదురైన దిగ్గజ షేర్లు
మార్కెట్లలో నెలకొన్న ఈ భారీ క్షీణత కారణంగా అగ్రశ్రేణి కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా.. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడమే మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
అమెరికా – ఇరాన్ మధ్య కొత్త యుద్ధ భయం
అమెరికా – ఇరాన్ మధ్య మళ్లీ కొత్త యుద్ధం వస్తుందనే భయమే స్టాక్ మార్కెట్ పతనానికి అతిపెద్ద కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరిక జారీ చేశారు. ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాజాగా ఆయన ఒక పోస్ట్లో ఆయన ఇలా పేర్కొన్నారు.. “ఇరాన్కు ఇచ్చిన గడువు వేగంగా గడిచిపోతోంది, వారు వీలైనంత త్వరగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే వారికి ఏమీ మిగలదు. సమయం చాలా విలువైనది” అంటూ రాసుకొచ్చారు.
ట్రంప్ బెదిరింపులు – హోర్ముజ్ జలసంధి విషయంలో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపించాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు $112కు చేరుకోగా, WTI ముడి చమురు ధరలు బ్యారెల్కు $108 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా సహజ వాయువు ధరలు కూడా సుమారు 3 శాతం పెరిగి, $3.034కు చేరుకున్నాయి.
విదేశాల నుంచి రెడ్ సిగ్నల్స్..
ఇండియన్ స్టాక్ మార్కెట్ పతనానికి విదేశీ మార్కెట్ల నుంచి రెడ్ సిగ్నల్స్ అందడం కూడా ఒక కారణం అని చెబుతున్నారు. గిఫ్ట్ నిఫై 195 పాయింట్లు పడిపోయి 23,550 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఆసియా మార్కెట్లలో కూడా ప్రకంపనలు కనిపించాయి. జపాన్ నిక్కీ సుమారు 600 పాయింట్లు పడిపోగా, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ కూడా 385 పాయింట్లు తగ్గింది. బ్రిటన్ మార్కెట్ FTSE-100 కూడా సుమారు 200 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది. వీటితో పాటు, DAX (510 పాయింట్లు), CAC (150 పాయింట్లు) కూడా క్షీణతలో ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!