Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు వారం ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే కుప్పకూలాయి. మార్కెట్ ప్రారంభం కావడంతోనే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా పతనమైంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా క్షీణతను నమోదు చేస్తూ ట్రేడింగ్ను కొనసాగిస్తోంది.
చెల్లాచెదురైన దిగ్గజ షేర్లు
మార్కెట్లలో నెలకొన్న ఈ భారీ క్షీణత కారణంగా అగ్రశ్రేణి కంపెనీల షేర్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా.. పవర్ గ్రిడ్, టాటా స్టీల్, మారుతి సుజుకి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటాన్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడమే మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
అమెరికా – ఇరాన్ మధ్య కొత్త యుద్ధ భయం
అమెరికా – ఇరాన్ మధ్య మళ్లీ కొత్త యుద్ధం వస్తుందనే భయమే స్టాక్ మార్కెట్ పతనానికి అతిపెద్ద కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరిక జారీ చేశారు. ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాజాగా ఆయన ఒక పోస్ట్లో ఆయన ఇలా పేర్కొన్నారు.. “ఇరాన్కు ఇచ్చిన గడువు వేగంగా గడిచిపోతోంది, వారు వీలైనంత త్వరగా వేగవంతమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే వారికి ఏమీ మిగలదు. సమయం చాలా విలువైనది” అంటూ రాసుకొచ్చారు.
ట్రంప్ బెదిరింపులు – హోర్ముజ్ జలసంధి విషయంలో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముడి చమురు ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నట్లు కనిపించాయి. బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు $112కు చేరుకోగా, WTI ముడి చమురు ధరలు బ్యారెల్కు $108 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంతేకాకుండా సహజ వాయువు ధరలు కూడా సుమారు 3 శాతం పెరిగి, $3.034కు చేరుకున్నాయి.
విదేశాల నుంచి రెడ్ సిగ్నల్స్..
ఇండియన్ స్టాక్ మార్కెట్ పతనానికి విదేశీ మార్కెట్ల నుంచి రెడ్ సిగ్నల్స్ అందడం కూడా ఒక కారణం అని చెబుతున్నారు. గిఫ్ట్ నిఫై 195 పాయింట్లు పడిపోయి 23,550 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఆసియా మార్కెట్లలో కూడా ప్రకంపనలు కనిపించాయి. జపాన్ నిక్కీ సుమారు 600 పాయింట్లు పడిపోగా, హాంకాంగ్ హ్యాంగ్సెంగ్ కూడా 385 పాయింట్లు తగ్గింది. బ్రిటన్ మార్కెట్ FTSE-100 కూడా సుమారు 200 పాయింట్ల క్షీణతతో ట్రేడవుతోంది. వీటితో పాటు, DAX (510 పాయింట్లు), CAC (150 పాయింట్లు) కూడా క్షీణతలో ట్రేడవుతున్నాయి.
తాజావార్తలు
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!