Stock Market: వరుసగా మూడోరోజూ నష్టాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా మూడవరోజూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాటు, మరో ఆర్థిక సంక్షోభం రాబోతోందనే అంచనాలు మార్కెట్లను ప్రభావితం చేశాయని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయితే వెంటనే మళ్లీ పతనంతో ముందుకు నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు కోల్పోయింది. 52,693కి సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 15,732 వద్ద స్థిరపడింది.
భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాభాల్లో నడిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్ , మారుతి, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నష్టాలు చవిచూశాయి. ఇదిలా వుంటే దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్ పై దిగుమతి భారం పడుతోంది. మే 21న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించగా అప్పటి నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రమే వ్యాట్ తగ్గించాయి.
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82గా ఉంది. విజయవాడలో పెట్రోల్ లీటరు రూ.111.81 గా వుంది. అలాగే, డీజిల్ లీటరు రూ. రూ.99.56గా వుంది, విశాఖపట్నంలో మాత్రం పెట్రోల్ ధర 80పైసలు తగ్గింది. అక్కడ లీటరు ధర రూ.110.48 గా ఉంది. డీజిల్ పై 74 పైసలు తగ్గి లీటరు రూ.98.27గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్నాటకల్లో చమురుధరలు తక్కువగా వున్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ రూ. 94.24 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 101.94 కాగా, డీజిల్ రూ. 87.89గా వుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!