Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండి మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అటు పెట్టుబడిదారులను, ఇటు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిదుడుకులతో సాగిన వెండి ధరలు, ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా డిజిటల్ సిల్వర్లో పెట్టుబడులు పెట్టిన వారు గత కొంతకాలంగా ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడగా.. తాజా పెరుగుదల వారికి కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.
ప్రస్తుతం వెండి ధరల ధోరణిని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా 10,000 రూపాయలు పెరగడం గమనార్హం. దీంతో ఇక్కడ కిలో వెండి ధర 2.70 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇదే తరహా ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.. అక్కడ ధర 5,000 రూపాయలు తగ్గడంతో కిలో వెండి 2.50 లక్షల రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వెండిని కేవలం ఆభరణాల కోసమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, టెలికాం, బయోఫార్మా వంటి రంగాల్లో వెండి వినియోగం అనివార్యంగా మారింది. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే విలువైన లోహాలనే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
గతంలో వెండి ధరలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు, భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతో చాలా మంది భారీగా వెండిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా డిజిటల్ వెండి రూపంలో ఇన్వెస్ట్ చేసిన వారు, ఆ తర్వాత క్రమంగా ధరలు పడిపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అప్పటి నుంచి నష్టాల్లో ఉన్న వారికి నేడు పెరిగిన ఈ 10,000 రూపాయలు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి.
మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయిన వారు మళ్ళీ లాభాల బాట పట్టే అవకాశం తాజా పరిణామాలతో కనిపిస్తోంది. సాంకేతిక రంగంలో వెండి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ధరల పెరుగుదల భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!