Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండి మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అటు పెట్టుబడిదారులను, ఇటు సామాన్య వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిదుడుకులతో సాగిన వెండి ధరలు, ఒక్కసారిగా మళ్లీ పుంజుకోవడం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా డిజిటల్ సిల్వర్లో పెట్టుబడులు పెట్టిన వారు గత కొంతకాలంగా ధరలు తగ్గడంతో నష్టాలను చవిచూడగా.. తాజా పెరుగుదల వారికి కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు.
ప్రస్తుతం వెండి ధరల ధోరణిని గమనిస్తే.. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర ఏకంగా 10,000 రూపాయలు పెరగడం గమనార్హం. దీంతో ఇక్కడ కిలో వెండి ధర 2.70 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇదే తరహా ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లోనూ కనిపిస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.. అక్కడ ధర 5,000 రూపాయలు తగ్గడంతో కిలో వెండి 2.50 లక్షల రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
- Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వెండిని కేవలం ఆభరణాల కోసమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, టెలికాం, బయోఫార్మా వంటి రంగాల్లో వెండి వినియోగం అనివార్యంగా మారింది. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న విపరీతమైన డిమాండ్, దానికి తగ్గట్టుగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే విలువైన లోహాలనే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు.
గతంలో వెండి ధరలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు, భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతో చాలా మంది భారీగా వెండిని కొనుగోలు చేశారు. ముఖ్యంగా డిజిటల్ వెండి రూపంలో ఇన్వెస్ట్ చేసిన వారు, ఆ తర్వాత క్రమంగా ధరలు పడిపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అప్పటి నుంచి నష్టాల్లో ఉన్న వారికి నేడు పెరిగిన ఈ 10,000 రూపాయలు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి.
మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయిన వారు మళ్ళీ లాభాల బాట పట్టే అవకాశం తాజా పరిణామాలతో కనిపిస్తోంది. సాంకేతిక రంగంలో వెండి ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ధరల పెరుగుదల భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!