Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నా, రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, సంపాదన ఎంత అన్నది కాదు, అందులో ఎంత పొదుపు చేశామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ పసిడి బాండ్ల (SGB) ఉదాహరణే తీసుకుంటే.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన చిన్న పెట్టుబడి నేడు ఏకంగా నాలుగు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సరైన సమయంలో.. సరైన చోట డబ్బును పొదుపు చేస్తే అది కాలక్రమేణా వటవృక్షమై మనకు ఆర్థిక స్వేచ్ఛను, భద్రతను ఇస్తుంది. పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు.. అది మన సంపదను సృష్టించే ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన సార్వభౌమ పసిడి బాండ్లు (Sovereign Gold Bonds – SGB) పెట్టుబడిదారులకు కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన 5వ సిరీస్ బాండ్ల గడువు ముగియడంతో.. వాటిని వెనక్కి తీసుకునే (Redemption) ధరను ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ బాండ్ల తుది విక్రయ ధరను గ్రాముకు రూ. 15,009గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల క్రితం (అక్టోబర్ 2019లో) ఈ బాండ్లను జారీ చేసినప్పుడు గ్రాము ధర కేవలం రూ. 3,788 మాత్రమే. అంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు ఒక గ్రాముపై ఏకంగా రూ. 11,221 లాభం వచ్చింది. ఇది దాదాపు 300 శాతానికి పైగా లేదా సుమారు 4 రెట్ల రాబడి.
Also Read
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
- Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
రిడంప్షన్ ధరను ఎలా లెక్కిస్తారు?
ఈ ధరను నిర్ణయించడానికి ఆర్బీఐ ఒక పద్ధతిని అనుసరిస్తుంది. బాండ్ గడువు ముగిసే తేదీకి ముందు ఉన్న చివరి మూడు పని దినాలలో (Working Days) మార్కెట్లో ఉన్న బంగారం సగటు ధరను (IBJA రేట్ల ప్రకారం) పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన ఏప్రిల్ 2026 నాటి ధరలను బట్టి ఈ భారీ రేటు ఖరారైంది.
అదనపు ప్రయోజనాలు..
కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభమే కాకుండాజజ ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులు మరిన్ని ప్రయోజనాలు పొందారు. వాటిలో ముఖ్యంగా వార్షిక వడ్డీ. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంపై ప్రతి ఏటా 2.5 శాతం వడ్డీ లభించింది. ఇది నేరుగా పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. గడువు ముగిసే వరకు బాండ్లను ఉంచుకుంటే.. వాటిపై వచ్చే లాభాల (Capital Gains) మీద ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
భౌతిక బంగారంతో పోలిస్తే వీటిని భద్రపరిచే టెన్షన్ ఉండదు.. నాణ్యత విషయంలో ఎటువంటి మోసాలకు అవకాశం ఉండదు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో.. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించే ఎస్జీబీలు స్టాక్ మార్కెట్ కంటే మెరుగైన రాబడులను అందించాయి. ఎనిమిదేళ్ల క్రితం ఓపికగా పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయించిన ఈ ధర ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
-
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
-
Abhijeet Dipke: “ఇది అంతం కాదు.. ఆరంభం”.. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
-
SBI Manager Slapped: ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ను చెంపదెబ్బ కొట్టిన మాజీ కేంద్ర మంత్రి కుమార్తె.. వీడియో
-
BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!