Gold Income: ఒక్క గ్రాము బంగారంపై రూ.11,221 లాభం.. ఆర్బీఐ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలామంది లక్షల్లో సంపాదిస్తున్నా, రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, సంపాదన ఎంత అన్నది కాదు, అందులో ఎంత పొదుపు చేశామన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ పసిడి బాండ్ల (SGB) ఉదాహరణే తీసుకుంటే.. ఎనిమిదేళ్ల క్రితం చేసిన చిన్న పెట్టుబడి నేడు ఏకంగా నాలుగు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. సరైన సమయంలో.. సరైన చోట డబ్బును పొదుపు చేస్తే అది కాలక్రమేణా వటవృక్షమై మనకు ఆర్థిక స్వేచ్ఛను, భద్రతను ఇస్తుంది. పొదుపు అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు.. అది మన సంపదను సృష్టించే ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేసిన సార్వభౌమ పసిడి బాండ్లు (Sovereign Gold Bonds – SGB) పెట్టుబడిదారులకు కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన 5వ సిరీస్ బాండ్ల గడువు ముగియడంతో.. వాటిని వెనక్కి తీసుకునే (Redemption) ధరను ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ బాండ్ల తుది విక్రయ ధరను గ్రాముకు రూ. 15,009గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎనిమిదేళ్ల క్రితం (అక్టోబర్ 2019లో) ఈ బాండ్లను జారీ చేసినప్పుడు గ్రాము ధర కేవలం రూ. 3,788 మాత్రమే. అంటే ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులకు ఒక గ్రాముపై ఏకంగా రూ. 11,221 లాభం వచ్చింది. ఇది దాదాపు 300 శాతానికి పైగా లేదా సుమారు 4 రెట్ల రాబడి.
Also Read
- LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
రిడంప్షన్ ధరను ఎలా లెక్కిస్తారు?
ఈ ధరను నిర్ణయించడానికి ఆర్బీఐ ఒక పద్ధతిని అనుసరిస్తుంది. బాండ్ గడువు ముగిసే తేదీకి ముందు ఉన్న చివరి మూడు పని దినాలలో (Working Days) మార్కెట్లో ఉన్న బంగారం సగటు ధరను (IBJA రేట్ల ప్రకారం) పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన ఏప్రిల్ 2026 నాటి ధరలను బట్టి ఈ భారీ రేటు ఖరారైంది.
అదనపు ప్రయోజనాలు..
కేవలం బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభమే కాకుండాజజ ఈ ఎనిమిదేళ్ల కాలంలో పెట్టుబడిదారులు మరిన్ని ప్రయోజనాలు పొందారు. వాటిలో ముఖ్యంగా వార్షిక వడ్డీ. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తంపై ప్రతి ఏటా 2.5 శాతం వడ్డీ లభించింది. ఇది నేరుగా పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. గడువు ముగిసే వరకు బాండ్లను ఉంచుకుంటే.. వాటిపై వచ్చే లాభాల (Capital Gains) మీద ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
భౌతిక బంగారంతో పోలిస్తే వీటిని భద్రపరిచే టెన్షన్ ఉండదు.. నాణ్యత విషయంలో ఎటువంటి మోసాలకు అవకాశం ఉండదు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో.. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావించే ఎస్జీబీలు స్టాక్ మార్కెట్ కంటే మెరుగైన రాబడులను అందించాయి. ఎనిమిదేళ్ల క్రితం ఓపికగా పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయించిన ఈ ధర ఒక గొప్ప బహుమతి అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
-
BSNL: బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్.. రూ. 51కే రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!