Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sensex Crash: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆర్థిక మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్యంపై పిడుగులా పడింది. ట్రంప్ హోర్ముజ్ జలసంధిపై సైనిక దిగ్బంధనాన్ని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి.
READ ALSO: Mangli: సింగర్ మంగ్లీపై రూ.10 కోట్ల మోసం కేసు.. అసలు నిజం ఏమిటి?
Also Read
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
గిఫ్ట్ నిఫ్టీలో పతనం.. ఆసియా మార్కెట్ల అతలాకుతలం
భారత మార్కెట్ల గమనాన్ని సూచించే గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) ఉదయాన్నే 300 పాయింట్లు (1.34%) పతనమై 23,768 వద్ద ట్రేడవుతోంది. కీలకమైన 24,000 మార్కును నిఫ్టీ కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. జపాన్ నిక్కీ 0.8% నష్టపోయింది. అలాగే హాంకాంగ్ హాంగ్ సెంగ్ 1% పడిపోయింది. సింగపూర్, మలేషియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే చైనా మార్కెట్లు మాత్రం కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ స్వల్ప లాభాల్లో ఉండటం గమనార్హం.
11 శాతం పెరిగిన ముడి చమురు ధరలు
ప్రపంచ చమురు రవాణాలో 20 శాతానికి పైగా వాటా ఉన్న హోర్ముజ్ జలసంధి మూతపడుతుందన్న వార్తతో చమురు మార్కెట్ భగ్గుమంది. ముడి చమురు ధరలు ఏకంగా 11 శాతం పెరిగి, బ్యారెల్కు 105 డాలర్లను దాటాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ $104.25 వద్ద, బ్రెంట్ క్రూడ్ $101 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్, లైవ్లాంగ్ వెల్త్ వ్యవస్థాపకుడు హరిప్రసాద్ కె అభిప్రాయం ప్రకారం.. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల (FII) నిధుల ఉపసంహరణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను రిస్క్-ఆఫ్ మోడ్లోకి నెట్టాయన్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం అయిన 8 నిమిషాల్లోనే మదుపరులు సుమారుగా రూ.8 లక్షల కోట్లు సంపదను కోల్పోయారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కొనసాగుతుంది.
READ ALSO: IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!