SBI: షాకింగ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఈఎంఐలు మరింత భారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది… బేస్ రేటును, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను 70 బేసిస్ పాయింట్లు పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది… ఎస్బీఐ తాజా నిర్ణయంతో బీపీఎల్ఆర్ రేటు అత్యధికంగా 13.45 శాతానికి చేరింది.. ఇక, బేస్ రేటు 8.7 శాతానికి పెరిగింది… దీంతో, బీపీఎల్ఆర్తో లింకైన రుణాల చెల్లింపులన్ని మరింత భారం కానున్నాయి… జూన్లో సమీక్షించిన సమయంలో బీపీఎల్ఆర్ రేటు 12.75 శాతంగా ఉండేది.. ఇప్పటి వరకు అదే అమల్లో ఉండగా… తాజా సవరణతో అది కాస్తా 13.45 శాతానికి చేరింది.. సమీక్షించిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది ఎస్బీఐ..
Read Also: SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం మరో మైలురాయి
Also Read
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
మరోవైపు.. బేస్ రేటు 8.7 శాతానికి పెంచడంతో.. బేస్ రేటుపై రుణాలు తీసుకున్న వారందరికీ ఈఎంఐలు మరింత భారం కాబోతున్నాయి.. బేస్ రేటుతో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. బ్యాంకులు రుణాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే పాత బెంచ్మార్క్లు ఇవి. ఇప్పుడు చాలా బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) లేదా రెపో-లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)పై రుణాలు అందజేస్తున్నాయి. బ్యాంక్ బీపీఎల్ఆర్ మరియు బేస్ రేటు రెండింటినీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. ఎస్బీఐ రుణ రేట్ల సవరణ చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా దీనినే అనుసరించే అవకాశం ఉంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశానికి ముందు బెంచ్మార్క్ లెండింగ్ రేట్ల పెరుగుదలతో.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.. షెడ్యూల్ ప్రకారం, తదుపరి ద్రవ్య విధాన సమావేశం సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది..
తాజావార్తలు
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!