SBI: షాకింగ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఈఎంఐలు మరింత భారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది… బేస్ రేటును, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను 70 బేసిస్ పాయింట్లు పెంచుతూ బుధవారం నిర్ణయం తీసుకుంది… ఎస్బీఐ తాజా నిర్ణయంతో బీపీఎల్ఆర్ రేటు అత్యధికంగా 13.45 శాతానికి చేరింది.. ఇక, బేస్ రేటు 8.7 శాతానికి పెరిగింది… దీంతో, బీపీఎల్ఆర్తో లింకైన రుణాల చెల్లింపులన్ని మరింత భారం కానున్నాయి… జూన్లో సమీక్షించిన సమయంలో బీపీఎల్ఆర్ రేటు 12.75 శాతంగా ఉండేది.. ఇప్పటి వరకు అదే అమల్లో ఉండగా… తాజా సవరణతో అది కాస్తా 13.45 శాతానికి చేరింది.. సమీక్షించిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచి అంటే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది ఎస్బీఐ..
Read Also: SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం మరో మైలురాయి
Also Read
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
- Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
మరోవైపు.. బేస్ రేటు 8.7 శాతానికి పెంచడంతో.. బేస్ రేటుపై రుణాలు తీసుకున్న వారందరికీ ఈఎంఐలు మరింత భారం కాబోతున్నాయి.. బేస్ రేటుతో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. బ్యాంకులు రుణాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే పాత బెంచ్మార్క్లు ఇవి. ఇప్పుడు చాలా బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) లేదా రెపో-లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)పై రుణాలు అందజేస్తున్నాయి. బ్యాంక్ బీపీఎల్ఆర్ మరియు బేస్ రేటు రెండింటినీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. ఎస్బీఐ రుణ రేట్ల సవరణ చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా దీనినే అనుసరించే అవకాశం ఉంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశానికి ముందు బెంచ్మార్క్ లెండింగ్ రేట్ల పెరుగుదలతో.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.. షెడ్యూల్ ప్రకారం, తదుపరి ద్రవ్య విధాన సమావేశం సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది..
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!