Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్ తేదీలను ఎట్టకేలకు ప్రకటించింది, ఇది నవంబర్ 24 నుండి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 28 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ సేల్ గెలాక్సీ Z Flip3, Galaxy S21 FE, Galaxy S22 మరియు మరిన్నింటితో సహా అనేక టాప్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఇతర శాంసంగ్ పరికరాలపై అదనపు డీల్లు మరియు ఆఫర్లు కూడా ఉంటాయి. ఐదు రోజుల ఈ సేల్లో గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ బడ్స్ 2 ప్రో, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లు మరియు మరెన్నో పరికరాల శ్రేణిపై ధర తగ్గింపులను కూడా అందిస్తారు. సేల్ కోసం శాంసంగ్ ఈ కంపెనీల బ్యాంక్ కార్డ్లు మరియు ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై అదనపు క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు కోటక్ బ్యాంక్ వంటి భారతీయ బ్యాంక్ కంపెనీలతో కలిసి పని చేస్తోంది.
Read Also: Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి
Also Read
- BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
- UPI Payment New Rules: UPI చెల్లింపు న్యూ రూల్స్.. ఈ రోజు నుండి డబ్బు పంపే విధానంలో మార్పులు
- Commercial LPG Price Hike: గ్యాస్ ధరల మంటలు .. భారీగా పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
- LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
మీరు కొత్త ఫోన్ లేదా మరేదైనా గాడ్జెట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా శాంసంగ్కు అభిమాని అయితే, ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఎంతో ఉపయోగపడనుంది.. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో నేటి నుంచి భారీ డిస్కౌంట్లతో అమ్మకాలకు సిద్ధమైంది శాంసంగ్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు అంటే… ఈ నెల 28 వరకూ ఈ సేల్ అమల్లో ఉంటుంది. వివిధ బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఇస్తోంది. శాంసంగ్ షాప్ యాప్ ద్వారా గాని, సమీపంలోని ఎలక్ట్రానిక్ స్టోర్ల వద్ద గాని ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ ఎస్22 స్మార్ట్ఫోన్లను రరూ. 60 వేల ధరకే అందించనుంది. ప్రస్తుతం శాంసంగ్ వనీలా గెలాక్సీ ఎస్22 ధర రూ. 67,999గా ఉంది. అంటే దాదాపు 8 వేలు తక్కువ ధరకే ఆ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. శాంసంగ్ తన తాజా ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను రివీల్ చేసింది. ప్రస్తుతం గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 ధర రూ. 89,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ. 80,999కే పొందొచ్చు.. సేల్ టీజర్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 రూ. 60 వేల లోపే విక్రయించనుంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్ రూ. 10 వేల డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు.. గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ (8GB RAM + 128GB ROM) వేరియంట్పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది.. ప్రస్తుత ధర రూ. 74,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో ఆఫర్పై రూ. 31,999లకే పొందే అవకాశం ఇచ్చింది..
తాజావార్తలు
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
-
Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
-
RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
-
Virat Kohli: నన్ను త్వరగా అవుట్ చేయాలని అందరూ చూస్తారు.. ఏం పర్లేదు, నా ప్లాన్స్ నాకుంటాయి!
-
Romantic Drama : తాగుబోతు ప్రేమకు ఇంత డిమాండా? ఐయండిబిలో 8.7 రేటింగ్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!