Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్ తేదీలను ఎట్టకేలకు ప్రకటించింది, ఇది నవంబర్ 24 నుండి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 28 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ సేల్ గెలాక్సీ Z Flip3, Galaxy S21 FE, Galaxy S22 మరియు మరిన్నింటితో సహా అనేక టాప్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఇతర శాంసంగ్ పరికరాలపై అదనపు డీల్లు మరియు ఆఫర్లు కూడా ఉంటాయి. ఐదు రోజుల ఈ సేల్లో గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ బడ్స్ 2 ప్రో, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లు మరియు మరెన్నో పరికరాల శ్రేణిపై ధర తగ్గింపులను కూడా అందిస్తారు. సేల్ కోసం శాంసంగ్ ఈ కంపెనీల బ్యాంక్ కార్డ్లు మరియు ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై అదనపు క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు కోటక్ బ్యాంక్ వంటి భారతీయ బ్యాంక్ కంపెనీలతో కలిసి పని చేస్తోంది.
Read Also: Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి
Also Read
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
మీరు కొత్త ఫోన్ లేదా మరేదైనా గాడ్జెట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా శాంసంగ్కు అభిమాని అయితే, ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఎంతో ఉపయోగపడనుంది.. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో నేటి నుంచి భారీ డిస్కౌంట్లతో అమ్మకాలకు సిద్ధమైంది శాంసంగ్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు అంటే… ఈ నెల 28 వరకూ ఈ సేల్ అమల్లో ఉంటుంది. వివిధ బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఇస్తోంది. శాంసంగ్ షాప్ యాప్ ద్వారా గాని, సమీపంలోని ఎలక్ట్రానిక్ స్టోర్ల వద్ద గాని ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ ఎస్22 స్మార్ట్ఫోన్లను రరూ. 60 వేల ధరకే అందించనుంది. ప్రస్తుతం శాంసంగ్ వనీలా గెలాక్సీ ఎస్22 ధర రూ. 67,999గా ఉంది. అంటే దాదాపు 8 వేలు తక్కువ ధరకే ఆ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. శాంసంగ్ తన తాజా ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను రివీల్ చేసింది. ప్రస్తుతం గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 ధర రూ. 89,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ. 80,999కే పొందొచ్చు.. సేల్ టీజర్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 రూ. 60 వేల లోపే విక్రయించనుంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్ రూ. 10 వేల డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు.. గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ (8GB RAM + 128GB ROM) వేరియంట్పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది.. ప్రస్తుత ధర రూ. 74,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో ఆఫర్పై రూ. 31,999లకే పొందే అవకాశం ఇచ్చింది..
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!