Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్ తేదీలను ఎట్టకేలకు ప్రకటించింది, ఇది నవంబర్ 24 నుండి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 28 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ సేల్ గెలాక్సీ Z Flip3, Galaxy S21 FE, Galaxy S22 మరియు మరిన్నింటితో సహా అనేక టాప్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఇతర శాంసంగ్ పరికరాలపై అదనపు డీల్లు మరియు ఆఫర్లు కూడా ఉంటాయి. ఐదు రోజుల ఈ సేల్లో గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ బడ్స్ 2 ప్రో, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లు మరియు మరెన్నో పరికరాల శ్రేణిపై ధర తగ్గింపులను కూడా అందిస్తారు. సేల్ కోసం శాంసంగ్ ఈ కంపెనీల బ్యాంక్ కార్డ్లు మరియు ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై అదనపు క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు కోటక్ బ్యాంక్ వంటి భారతీయ బ్యాంక్ కంపెనీలతో కలిసి పని చేస్తోంది.
Read Also: Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి
Also Read
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
మీరు కొత్త ఫోన్ లేదా మరేదైనా గాడ్జెట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా శాంసంగ్కు అభిమాని అయితే, ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఎంతో ఉపయోగపడనుంది.. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో నేటి నుంచి భారీ డిస్కౌంట్లతో అమ్మకాలకు సిద్ధమైంది శాంసంగ్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు అంటే… ఈ నెల 28 వరకూ ఈ సేల్ అమల్లో ఉంటుంది. వివిధ బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఇస్తోంది. శాంసంగ్ షాప్ యాప్ ద్వారా గాని, సమీపంలోని ఎలక్ట్రానిక్ స్టోర్ల వద్ద గాని ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ ఎస్22 స్మార్ట్ఫోన్లను రరూ. 60 వేల ధరకే అందించనుంది. ప్రస్తుతం శాంసంగ్ వనీలా గెలాక్సీ ఎస్22 ధర రూ. 67,999గా ఉంది. అంటే దాదాపు 8 వేలు తక్కువ ధరకే ఆ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. శాంసంగ్ తన తాజా ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను రివీల్ చేసింది. ప్రస్తుతం గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 ధర రూ. 89,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ. 80,999కే పొందొచ్చు.. సేల్ టీజర్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 రూ. 60 వేల లోపే విక్రయించనుంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్ రూ. 10 వేల డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు.. గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ (8GB RAM + 128GB ROM) వేరియంట్పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది.. ప్రస్తుత ధర రూ. 74,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో ఆఫర్పై రూ. 31,999లకే పొందే అవకాశం ఇచ్చింది..
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!