Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్ తేదీలను ఎట్టకేలకు ప్రకటించింది, ఇది నవంబర్ 24 నుండి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 28 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ సేల్ గెలాక్సీ Z Flip3, Galaxy S21 FE, Galaxy S22 మరియు మరిన్నింటితో సహా అనేక టాప్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఇతర శాంసంగ్ పరికరాలపై అదనపు డీల్లు మరియు ఆఫర్లు కూడా ఉంటాయి. ఐదు రోజుల ఈ సేల్లో గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ బడ్స్ 2 ప్రో, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లు మరియు మరెన్నో పరికరాల శ్రేణిపై ధర తగ్గింపులను కూడా అందిస్తారు. సేల్ కోసం శాంసంగ్ ఈ కంపెనీల బ్యాంక్ కార్డ్లు మరియు ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై అదనపు క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు కోటక్ బ్యాంక్ వంటి భారతీయ బ్యాంక్ కంపెనీలతో కలిసి పని చేస్తోంది.
Read Also: Udayanidhi Stalin: కొడుక్కి మళ్లీ కీలక పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి
Also Read
- Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
మీరు కొత్త ఫోన్ లేదా మరేదైనా గాడ్జెట్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే లేదా శాంసంగ్కు అభిమాని అయితే, ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ ఎంతో ఉపయోగపడనుంది.. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో నేటి నుంచి భారీ డిస్కౌంట్లతో అమ్మకాలకు సిద్ధమైంది శాంసంగ్. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు అంటే… ఈ నెల 28 వరకూ ఈ సేల్ అమల్లో ఉంటుంది. వివిధ బ్యాంకులు క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఇస్తోంది. శాంసంగ్ షాప్ యాప్ ద్వారా గాని, సమీపంలోని ఎలక్ట్రానిక్ స్టోర్ల వద్ద గాని ఈ ఆఫర్లను వినియోగించుకోవచ్చు.
శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్ ఎస్22 స్మార్ట్ఫోన్లను రరూ. 60 వేల ధరకే అందించనుంది. ప్రస్తుతం శాంసంగ్ వనీలా గెలాక్సీ ఎస్22 ధర రూ. 67,999గా ఉంది. అంటే దాదాపు 8 వేలు తక్కువ ధరకే ఆ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.. శాంసంగ్ తన తాజా ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలను రివీల్ చేసింది. ప్రస్తుతం గెలాక్సీ జడ్ ఫ్లిప్ 4 ధర రూ. 89,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో రూ. 80,999కే పొందొచ్చు.. సేల్ టీజర్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 రూ. 60 వేల లోపే విక్రయించనుంది. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్ రూ. 10 వేల డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు.. గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ (8GB RAM + 128GB ROM) వేరియంట్పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది.. ప్రస్తుత ధర రూ. 74,999గా ఉండగా, బ్లాక్ ఫ్రైడే సేల్లో ఆఫర్పై రూ. 31,999లకే పొందే అవకాశం ఇచ్చింది..
తాజావార్తలు
-
Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.