Bharat Mobility Global Expo 2025: నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్

  • నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్
  • గ్లోబల్ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
  • ఢిల్లీలోని గ్లోబల్ ఎక్స్‌పోలో కొత్త కార్లను విడుదల చేయనున్న పలు కంపెనీలు
  • గ్లోబల్ ఎక్స్‌పోలో వాహనాల ప్రదర్శనతో పాటు, స్పేర్ పార్ట్స్ ప్రదర్శన
Modi

Modi

Bharat Mobility Global Expo 2025: ప్రతిష్ఠాత్మక భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్‌పో ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో వాహన తయారీదార్లతో పాటు విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ భాగాలు, టైర్‌- ఇంధన స్టోరేజ్‌ తయారీదార్లు, వాహన సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, మెటీరియల్‌ రీసైక్లర్‌లు తమ అధునాతన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నారు. అయితే, బియాండ్‌ బౌండరీస్‌: కో-క్రియేటింగ్‌ ఫ్యూచర్‌ ఆటోమోటివ్‌ వాల్యూ చెయిన్‌ పేరిట ఈ గ్లోబల్‌ ఎక్స్‌పోను 3 వేదికలు విభజించారు. అందులో ఒకటి ఢిల్లీలోని భారత్‌ మండపం, రెండోది ద్వారకా దగ్గర యశోభూమి, మూడోది గ్రేటర్‌ నోయిడాలోని ఢిల్లీ, ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌లలో జరగనుంది.

Read Also: Realme 14 Pro Series: ప్రపంచంలో మొట్టమొదటి రంగులు మారే ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్స్ ఇవే

×
×
Ad

ఇక, గ్లోబల్‌ ఎక్స్‌పోను పరిశ్రమ సంఘాలు ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్, ఏటీఎంఏ, ఐసీఈఎంఏ, సియామ్, ఏసీఎంఏ, ఐఈఎస్‌ఏ, నాస్కామ్, సీఐఐ, మెటీరియల్‌ రీసైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ ఎక్స్‌పోకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 5,100 మంది అంతర్జాతీయ భాగస్వాములుగా కొనసాగుతున్నారు.