కోవిడ్ 19 అన్ని రంగాలను కుదిపేసింది.. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.. దీంతో, దేశాన్ని మన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పన్నులు తప్పవనే ప్రచారం సాగింది.. రాబడి పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 సెస్ విధించేందుకు సిద్ధమైందనే ఊహాగానాలు వినపడ్డాయి. కానీ, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాయి అధికార వర్గాలు.. కోవిడ్-19 సెస్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, యూనియన్ బడ్జెట్కు ముందు కూడా ఇలాంటి ప్రచారం సాగింది.. ఆ తర్వాత కూడా ఎక్కడో బాదేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి.. అసలే కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది.. ఈ తరుణంలో అదనపు సెస్లు, వడ్డింపులు ఏంటి? అని మండిపడ్డారు సామాన్యులు.. బతకడమే కష్టంగా మారితే.. ఈ బాదుడేంటి? అని ప్రశ్నించారు. కానీ, అలాంటిది ఏమీ లేదంటూ సామాన్యుడికి ఊరట కలిగిస్తోంది కేంద్రం. మరి.. మునుముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.