Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్ను దాటుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా గత కొంతకాలంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు తిరిగి కోలుకుంటూ ‘రిలీఫ్ ర్యాలీ’ దిశగా పయనిస్తున్నాయని ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (CIO) మనీష్ సొంతాలియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 నేడు 24,000 మార్కును దాటేసింది. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మినహా భారత మార్కెట్లు బేరిష్ (నష్టాల) వైపు వెళ్లడానికి పెద్దగా బలమైన కారణాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఒడిదుడుకులు ఎదురైనా నిఫ్టీ 22,000 మార్కును దాటి కిందకు పడిపోయే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, విస్తృత మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మార్కెట్ ఇప్పటికే అంచనా వేసిందని సొంతాలియా పేర్కొన్నారు. ఒకవేళ ఈ సంక్షోభం త్వరగా ముగిసిపోతే, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. “మేము ఇప్పటికే దాదాపుగా ఈ త్రైమాసిక ఫలితాల ముగింపు దశకు చేరుకున్నాం. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికాన్ని పరిశీలిస్తే, నిఫ్టీ 500 ఇండెక్స్లోని సుమారు 44-45 శాతం కంపెనీలు తమ ఆదాయ వృద్ధి 25 శాతం కంటే ఎక్కువగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి” అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read
- Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
- Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
రివర్సల్ జోన్ ..
మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఒకానొక సమయంలో 2027 ఆర్థిక సంవత్సర ఆదాయాలపై 10 నుంచి 12 శాతం ప్రతికూల ప్రభావం పడుతుందని మార్కెట్ భావించింది. అయితే, ప్రస్తుతానికి ఈ సంక్షోభం మరింత ఉధృతం కాకుండా అదుపులోనే ఉండటం, శాంతి ప్రయత్నాలు ప్రారంభం కావడంతో ఈ అంచనాలను సవరించాల్సి ఉంటుందని సొంతాలియా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలు 12-13 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.
మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతల వల్ల కొన్ని రంగాలు తమ ప్రాథమిక విలువల కంటే చాలా కిందకు పడిపోయాయని, ఇప్పుడు జరుగుతున్న రికవరీ వాటిని మళ్లీ పుంజుకునేలా చేస్తోందని ఆయన వివరించారు. గ్లోబల్ మార్కెట్లలో మళ్లీ స్థిరత్వం వస్తోందని హర్షం వ్యక్తం చేసినప్పటికీ, కంపెనీల నుంచి మరింత బలమైన ఆదాయ ఫలితాలు రానంత వరకు నిఫ్టీ 25,000 మార్కును దాటి భారీగా లాభపడటం కూడా కష్టమేనని మనీష్ సొంతాలియా హెచ్చరించారు. కేవలం సెంటిమెంట్తోనే మార్కెట్ తదుపరి రికార్డులను సృష్టించలేదని, దానికి కార్పొరేట్ వృద్ధి తోడవాలని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Samson vs Vaibhav: మూడు మ్యాచ్లకేనా.. జోక్ చేస్తున్నారా?.. వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!