Nifty 50: రికవరీ దిశలో స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 25,000 మార్క్ను దాటుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా గత కొంతకాలంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు తిరిగి కోలుకుంటూ ‘రిలీఫ్ ర్యాలీ’ దిశగా పయనిస్తున్నాయని ఎమ్కే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (CIO) మనీష్ సొంతాలియా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 50 నేడు 24,000 మార్కును దాటేసింది. అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మినహా భారత మార్కెట్లు బేరిష్ (నష్టాల) వైపు వెళ్లడానికి పెద్దగా బలమైన కారణాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఒడిదుడుకులు ఎదురైనా నిఫ్టీ 22,000 మార్కును దాటి కిందకు పడిపోయే అవకాశం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, విస్తృత మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మార్కెట్ ఇప్పటికే అంచనా వేసిందని సొంతాలియా పేర్కొన్నారు. ఒకవేళ ఈ సంక్షోభం త్వరగా ముగిసిపోతే, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. “మేము ఇప్పటికే దాదాపుగా ఈ త్రైమాసిక ఫలితాల ముగింపు దశకు చేరుకున్నాం. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికాన్ని పరిశీలిస్తే, నిఫ్టీ 500 ఇండెక్స్లోని సుమారు 44-45 శాతం కంపెనీలు తమ ఆదాయ వృద్ధి 25 శాతం కంటే ఎక్కువగా ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి” అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
రివర్సల్ జోన్ ..
మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఒకానొక సమయంలో 2027 ఆర్థిక సంవత్సర ఆదాయాలపై 10 నుంచి 12 శాతం ప్రతికూల ప్రభావం పడుతుందని మార్కెట్ భావించింది. అయితే, ప్రస్తుతానికి ఈ సంక్షోభం మరింత ఉధృతం కాకుండా అదుపులోనే ఉండటం, శాంతి ప్రయత్నాలు ప్రారంభం కావడంతో ఈ అంచనాలను సవరించాల్సి ఉంటుందని సొంతాలియా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలు 12-13 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.
మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతల వల్ల కొన్ని రంగాలు తమ ప్రాథమిక విలువల కంటే చాలా కిందకు పడిపోయాయని, ఇప్పుడు జరుగుతున్న రికవరీ వాటిని మళ్లీ పుంజుకునేలా చేస్తోందని ఆయన వివరించారు. గ్లోబల్ మార్కెట్లలో మళ్లీ స్థిరత్వం వస్తోందని హర్షం వ్యక్తం చేసినప్పటికీ, కంపెనీల నుంచి మరింత బలమైన ఆదాయ ఫలితాలు రానంత వరకు నిఫ్టీ 25,000 మార్కును దాటి భారీగా లాభపడటం కూడా కష్టమేనని మనీష్ సొంతాలియా హెచ్చరించారు. కేవలం సెంటిమెంట్తోనే మార్కెట్ తదుపరి రికార్డులను సృష్టించలేదని, దానికి కార్పొరేట్ వృద్ధి తోడవాలని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్లిఫ్ట్లో అదిరిపోయే మార్పులు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!