Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కార్మిక చట్టాల (New Labour Rules) అమలుతో భారతీయ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచడం, పని ప్రదేశాల్లో మెరుగైన వాతావరణాన్ని కల్పించడం. పాత నిబంధనల ప్రకారం ఉన్న ఎన్నో లొసుగులను సరిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ నూతన సంస్కరణలను తీసుకువచ్చింది.
ముఖ్యంగా వేతన నిర్మాణం మారడం వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలు మెరుగుపడతాయి. గతంలో కంటే స్పష్టమైన నిబంధనలతో కంపెనీల జవాబుదారీతనాన్ని పెంచుతూ.. ఉద్యోగుల హక్కులకు పెద్దపీట వేయడం ఈ చట్టాల వెనుక ఉన్న అసలు లక్ష్యం. ప్రతి ఉద్యోగి తన జీతం, సెలవులు, సెటిల్మెంట్ల విషయంలో ప్రభుత్వం కల్పిస్తున్న ఈ కొత్త సౌలభ్యాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
Also Read
- Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
- E20 Ethanol Blending: E20 పెట్రోల్పై అపోహలకు కేంద్రం చెక్.. ఇంజిన్కు ఎలాంటి నష్టం లేదు, 10 అంశాలతో వివరణ
- EPFOలో కీలక మార్పులు.. పోర్టల్లో రెండు సేవలకు ముగింపు..
- RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
ఈ కొత్త నిబంధనల వల్ల కలిగే ప్రధాన మార్పులను పరిశీలిస్తే.. మొదటగా వేతన నిర్మాణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. పాత నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ కనీసం 30 శాతం ఉండగా.. కొత్త రూల్స్ ప్రకారం ఇది CTCలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల ప్రతి నెలా కట్ అయ్యే పీఎఫ్ (PF) పెరుగుతుంది, ఫలితంగా భవిష్యత్తులో ఉద్యోగికి అందే రిటైర్మెంట్ ఫండ్ మరింత బలంగా ఉంటుంది. గ్రాట్యుటీ విషయంలో కూడా కేంద్రం ఊరటనిచ్చింది. గతంలో 5 ఏళ్లు ఒకే సంస్థలో పని చేస్తేనే వచ్చే గ్రాట్యుటీ, ఇకపై కేవలం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినా లభిస్తుంది.
పని వేళలు , జీతాల చెల్లింపుల్లో కూడా నిబంధనలు కఠినతరం అయ్యాయి. ప్రతి నెలా 10వ తేదీ లోపు వచ్చే జీతం, ఇకపై 7వ తేదీ లోపే ఉద్యోగి ఖాతాలో జమ కావాలి. పని గంటల విషయానికి వస్తే.. వారానికి గరిష్టంగా 48 గంటల పని పరిమితిని విధించారు. ఒకవేళ ఎవరైనా రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే (Overtime), వారికి పాత పద్ధతులతో సంబంధం లేకుండా రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఉద్యోగం వదిలేసినప్పుడు ఇచ్చే ‘ఫుల్ అండ్ ఫైనల్’ (F&F) సెటిల్మెంట్ను పాత చట్టాల మాదిరిగా నెలల తరబడి ఆలస్యం చేయకుండా, కేవలం 2 పని దినాల లోపే పూర్తి చేయాలని ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. ఇవన్నీ కలిపి ఒక సామాన్య ఉద్యోగికి మెరుగైన ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి అమలుకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా తుది నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. వచ్చే నెల నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Hrithik Roshan Divorce: హృతిక్ నుంచి 400 కోట్ల భరణం.. వైరల్ వార్తపై షాకింగ్ ట్విస్ట్!
-
Hyderabad: కల్తీ ఆహారంపై H-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు నమోదు.! 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్..
-
IND vs ENG 2nd T20: ప్లేయింగ్ ఎలెవన్లో సంజు, వైభవ్.. అసలు వేటు మనోడి పైనే?
-
Explainer: పెట్రోల్ రేట్ల దోపిడీ ఆగేదెప్పుడు..? ఇంధన ధరల మాయాజాలంపై కీలక రిపోర్ట్!
-
Delhi Government: కీలక ఆదేశాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై
ట్రెండింగ్
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!