Mukesh Ambani: శాలరీ తీసుకోని ముఖేష్ అంబానీ. ఇది వరుసగా రెండో ఏడాది కావటం విశేషం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ వేతనం తీసుకోలేదు. 2020లో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభించడంతో ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో ఆయన 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి శాలరీని స్వచ్ఛందంగా వదలుకున్నారు. 2021-2022లో కూడా ముఖేష్ అంబానీ వేతనం తీసుకోలేదని రిలయెన్స్ సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇదే కాదు. శాలరీ విషయంలో ముఖేష్ అంబానీ 2008లో కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు. అలవెన్సులు, ఇన్సెంటివ్స్, రిటైరల్ బెనెఫిట్స్ అన్నీ కలిపి వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలకు మించి తీసుకోనని తేల్చిచెప్పారు. 2020 వరకు కూడా అదే ఫాలో అయ్యారు. ఆ సంవత్సరం నుంచి అసలే తీసుకోవటం మానేశారు. రిలయెన్స్ గ్రూపులోని కొన్ని కంపెనీల వారసత్వాన్ని ఇటీవలే తన కుమారుడికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
Also Read
- PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
- IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
- Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
- SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
UDAN Scheme: ఉడాన్ పథకం ఘనత. ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలు ప్రారంభం.
రూ.6.42 ట్రిలియన్ల రికవరీ
ప్రభుత్వ రంగ బ్యాంకులు 2014-22 మధ్య కాలంలో 6.42 ట్రిలియన్ల రూపాయలు రికవరీ చేశాయి. మొండి బకాయిలు (ఎన్పీఏలు), సాంకేతికంగా రద్దు చేసిన (రిటన్ ఆఫ్) లోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. 98.5 శాతం మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కోర్టుల్లో కేసులు వేశాయి. ఇదిలాఉండగా 2015-21 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.36 ట్రిలియన్లు సమకూర్చింది. మూలధనం కింద వీటిని అందజేసింది. మరో వైపు మార్కెట్ల నుంచి రూ.2.99 ట్రిలియన్లు సేకరించింది.
గ్రేట్ ‘అప్గ్రాడ్’
ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫాం అయిన అప్గ్రాడ్.. రూ.1,670 కోట్ల నిధులను సమీకరించింది. వివిధ ఎడ్టెక్ సంస్థలు తీవ్ర నిధుల లేమితోపాటు వివిధ కారణాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తున్న నేపథ్యంలో అప్గ్రాడ్ ఈ స్థాయిలో రాణించటం విశేషమనే చెప్పాలి. అంతేకాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక స్థూల ఆదాయం రూ.400-500 కోట్లు నమోదు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. అప్గ్రాడ్కి 30 లక్షలకు పైగా లెర్నర్ బేస్ ఉండటం గమనార్హం.
‘టాటా’ చేతికి ‘ఫోర్డ్’
గుజరాత్లోని సనంద్ సిటీలో ఉన్న ఫోర్డ్ ఇండియా ప్లాంట్ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.725.7 కోట్లు. ఈ రెండు సంస్థల తయారీ యూనిట్లు సనంద్లో పక్కపక్కనే ఉండటం గమనార్హం. యూనిట్ ట్రాన్స్ఫర్ ఒప్పందంపై రెండు కంపెనీలు ఇవాళే సంతకాలు చేశాయి. అర్హులైన ఫోర్డ్ సిబ్బందికి తమ దగ్గర ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ రెండు సంస్థలు ఒక్కటి కావటంతో ప్రయాణికుల వాహనాల విభాగంలో ఇక ‘టాటా’ బలమైన ముద్ర వేయనుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!