LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
- ఎల్ఐసీ షేర్లలో భారీ పతనం
- రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్
- పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ (LIC) షేర్లు ఒక్కసారిగా దాదాపు 50 శాతం పడిపోయి రూ.823 నుంచి రూ.414 స్థాయికి చేరాయి. అయితే, ఈ పతనం వల్ల పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం 1:1 బోనస్ షేర్ల జారీ. ఎల్ఐసీ తమ వాటాదారులకు తొలిసారిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది.
అంటే, ఒక షేర్ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి అదనంగా మరో షేర్ ఉచితంగా లభిస్తుంది. మే 29న LIC షేర్లు ఎక్స్-బోనస్గా ట్రేడ్ కావడం వల్లే షేర్ ధర సర్దుబాటు చెంది సగానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. అందువల్ల, షేర్ ధరలో కనిపిస్తున్న ఈ తగ్గుదల కంపెనీ విలువ తగ్గిందని కాదు. ఇది కేవలం బోనస్ షేర్ల సర్దుబాటు కారణంగా జరిగిన సాంకేతిక మార్పు మాత్రమే.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
బోనస్ ఇష్యూ కోసం మే 29 రికార్డ్ డేట్
ఎల్ఐసీ ఈ బోనస్ షేర్ల జారీని ఏప్రిల్లో ప్రకటించింది. కంపెనీ బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. బోనస్ షేర్లకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు మే 29ను రికార్డ్ డేట్గా నిర్ణయించింది. అంటే, మే 29 నాటికి LIC షేర్లు కలిగి ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి ఒక్కో షేర్కు మరో బోనస్ షేర్ లభిస్తుంది.
ప్రభుత్వ వాటాల విక్రయ వార్తల ప్రభావం
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో మరో 2 శాతం విక్రయించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు కూడా షేర్పై ఒత్తిడిని పెంచాయి. ఈ వార్తల నేపథ్యంలో LIC షేర్లు దాదాపు 3 శాతం పడిపోయి రూ.830 వద్ద ముగిశాయి.
LIC ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయన్న నిపుణులు
మార్కెట్ నిపుణుడు, యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా మాట్లాడుతూ, LIC సంస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ (డిస్ఇన్వెస్ట్మెంట్) వార్తలు సమీప భవిష్యత్తులో స్టాక్పై కొంత ఒత్తిడిని తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!