LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
- ఎల్ఐసీ షేర్లలో భారీ పతనం
- రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్
- పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ (LIC) షేర్లు ఒక్కసారిగా దాదాపు 50 శాతం పడిపోయి రూ.823 నుంచి రూ.414 స్థాయికి చేరాయి. అయితే, ఈ పతనం వల్ల పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం 1:1 బోనస్ షేర్ల జారీ. ఎల్ఐసీ తమ వాటాదారులకు తొలిసారిగా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది.
అంటే, ఒక షేర్ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి అదనంగా మరో షేర్ ఉచితంగా లభిస్తుంది. మే 29న LIC షేర్లు ఎక్స్-బోనస్గా ట్రేడ్ కావడం వల్లే షేర్ ధర సర్దుబాటు చెంది సగానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. అందువల్ల, షేర్ ధరలో కనిపిస్తున్న ఈ తగ్గుదల కంపెనీ విలువ తగ్గిందని కాదు. ఇది కేవలం బోనస్ షేర్ల సర్దుబాటు కారణంగా జరిగిన సాంకేతిక మార్పు మాత్రమే.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
బోనస్ ఇష్యూ కోసం మే 29 రికార్డ్ డేట్
ఎల్ఐసీ ఈ బోనస్ షేర్ల జారీని ఏప్రిల్లో ప్రకటించింది. కంపెనీ బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. బోనస్ షేర్లకు అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు మే 29ను రికార్డ్ డేట్గా నిర్ణయించింది. అంటే, మే 29 నాటికి LIC షేర్లు కలిగి ఉన్న ప్రతి పెట్టుబడిదారుడికి ఒక్కో షేర్కు మరో బోనస్ షేర్ లభిస్తుంది.
ప్రభుత్వ వాటాల విక్రయ వార్తల ప్రభావం
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం LICలో తన వాటాలో మరో 2 శాతం విక్రయించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలు కూడా షేర్పై ఒత్తిడిని పెంచాయి. ఈ వార్తల నేపథ్యంలో LIC షేర్లు దాదాపు 3 శాతం పడిపోయి రూ.830 వద్ద ముగిశాయి.
LIC ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయన్న నిపుణులు
మార్కెట్ నిపుణుడు, యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా మాట్లాడుతూ, LIC సంస్థ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపారు. నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రభుత్వ వాటాల ఉపసంహరణ (డిస్ఇన్వెస్ట్మెంట్) వార్తలు సమీప భవిష్యత్తులో స్టాక్పై కొంత ఒత్తిడిని తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?