Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 కి చేరుకుంది. ఇక నేడు సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ , కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా మరియు ఎల్&టి కంపెనీలు షేర్లు లాభాల్లో ముగిసాయి.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఉండాల్సిందే..! తేల్చిచెప్పిన కెప్టెన్
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ఇక మరోసారి హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,356.83 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలర్తో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 88.90 గా ఉంది.
Also Read: Heart health: కరోనరీ హార్ట్ డిసీజ్ కి డయాబెటిస్ కారణమవుతోందా..?
ఇక నేడు ఇండెక్స్ భారీగా పెరగడానికి కారణం చూస్తే.. ఇండెక్స్ పనితీరులో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఐసీసీఐ షేర్లు మంచి త్రైమాసిక ఫలితాలను నివేదించిన తర్వాత మంచి పనితీరును కనబరిచాయి. ఫలితాల తర్వాత ఎస్బిఐ షేర్లు కొనుగోలు మద్దతును పొందాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట అభివృద్ధి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడానికి మరో కారణం. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, యూరప్ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రకటించనున్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. ఇకమరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలించడం కూడా మార్కెట్ సెంటిమెంట్కు దోహదపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం సడలించడం వల్ల చమురు ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
తాజావార్తలు
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!