Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 కి చేరుకుంది. ఇక నేడు సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ , కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా మరియు ఎల్&టి కంపెనీలు షేర్లు లాభాల్లో ముగిసాయి.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఉండాల్సిందే..! తేల్చిచెప్పిన కెప్టెన్
Also Read
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు
- Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
ఇక మరోసారి హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,356.83 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలర్తో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 88.90 గా ఉంది.
Also Read: Heart health: కరోనరీ హార్ట్ డిసీజ్ కి డయాబెటిస్ కారణమవుతోందా..?
ఇక నేడు ఇండెక్స్ భారీగా పెరగడానికి కారణం చూస్తే.. ఇండెక్స్ పనితీరులో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఐసీసీఐ షేర్లు మంచి త్రైమాసిక ఫలితాలను నివేదించిన తర్వాత మంచి పనితీరును కనబరిచాయి. ఫలితాల తర్వాత ఎస్బిఐ షేర్లు కొనుగోలు మద్దతును పొందాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట అభివృద్ధి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడానికి మరో కారణం. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, యూరప్ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రకటించనున్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. ఇకమరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలించడం కూడా మార్కెట్ సెంటిమెంట్కు దోహదపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం సడలించడం వల్ల చమురు ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
తాజావార్తలు
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!