Intraday Share Markets: భారీ లాభాలతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 కి చేరుకుంది. ఇక నేడు సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ , కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా మరియు ఎల్&టి కంపెనీలు షేర్లు లాభాల్లో ముగిసాయి.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఉండాల్సిందే..! తేల్చిచెప్పిన కెప్టెన్
Also Read
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
ఇక మరోసారి హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,356.83 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలర్తో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 88.90 గా ఉంది.
Also Read: Heart health: కరోనరీ హార్ట్ డిసీజ్ కి డయాబెటిస్ కారణమవుతోందా..?
ఇక నేడు ఇండెక్స్ భారీగా పెరగడానికి కారణం చూస్తే.. ఇండెక్స్ పనితీరులో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఐసీసీఐ షేర్లు మంచి త్రైమాసిక ఫలితాలను నివేదించిన తర్వాత మంచి పనితీరును కనబరిచాయి. ఫలితాల తర్వాత ఎస్బిఐ షేర్లు కొనుగోలు మద్దతును పొందాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట అభివృద్ధి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడానికి మరో కారణం. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, యూరప్ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రకటించనున్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. ఇకమరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలించడం కూడా మార్కెట్ సెంటిమెంట్కు దోహదపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం సడలించడం వల్ల చమురు ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!