Apple CFO: ఆపిల్ సీఎఫ్ఓగా భారత్ సంతతికి చెందిన కెవాన్ పరేఖ్
- ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించిన ఆపిల్
- కంపెనీ సీఎఫ్ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటన
- కొత్త సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపిల్ తన రాబోయే స్మార్ట్ఫోన్ సిరీస్ ఐఫోన్ 16 లాంచ్ తేదీని ప్రకటించింది. దీనితో పాటు, తమ సీఎఫ్ఓ లూకా మేస్త్రి తన పదవికి రాజీనామా చేసినట్లు కూడా కంపెనీ తెలియజేసింది. లూకా స్థానంలో భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ కొత్త సీఎఫ్ఓగా నియమితులయ్యారు. పరేఖ్ ఆపిల్తో 11 సంవత్సరాల పాటు అనుబంధం కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆయన జనవరి 1, 2025 నుంచి సీఎఫ్ఓ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆపిల్ కంపెనీ సీఈవో టీమ్ కుక్ స్వయంగా ప్రకటించింది.
READ MORE: Andhra Pradesh: భర్తను హత్య చేసిన కేసులో భార్యతో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
సీఎఫ్ఓగా నియమితులైన కేవన్ పరేఖ్ ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా సేల్స్, రీటైల్, మార్కెటింగ్ వ్యవహారాలు పరీక్షిస్తున్నారు. కంపెనీ ఆర్థిక వాణిజ్య విభాగంలో కేవన్ పరేఖ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సామర్థ్యం, ఫైనాన్షియల్ స్కిల్స్ గుర్తించిన ఆపిల్ కంపెనీ తదుపరి సీఎఫ్ఓగా ప్రకటించింది. కేవన్ పరేఖ్ మిచిగాన్ యూనివర్శిటీ నుంచి 1989-1993లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నారు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ పట్టా పొందారు.
READ MORE:Cabinet Decisions: 12 కొత్త స్మార్ట్ సిటీలు,10 లక్షల మందికి ఉద్యోగాలు.. కేబినెట్ నిర్ణయం..
ఆపిల్ కంపెనీ కంటే ముందు కేవన్ పరేఖ్ థామ్సన్ రాయిటర్స్ , జనరల్ మోటార్స్ కంపెనీల్లో కీలకమైన పదవుల్లో పనిచేశారు. ఫైనాన్స్, కార్పొరేట్ ట్రెజరర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ రీజనల్ ట్రెజరర్ విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ఆపిల్ కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనానలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా చేరారు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ సీఎఫఓగా ఉన్న లూకా మేస్త్రి స్వయంగా తన తరువాత ఈ పదవికి కేవన్ పరేఖ్ సమర్ధుడని భావించి సిద్ధం చేశారు. సీఎఫ్ఓ నుంచి తప్పుకున్న తరువాత కూడా లూకా మేస్త్రి ఆపిల్ కంపెనీలో కొనసాగనున్నారు.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?