Sound Alert System: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ ఉండాల్సిందే!
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- ఈవీ వెహికిల్స్ కి సౌండ్ తప్పనిసరి చేసిన కేంద్రం..
- 2027 అక్టోబర్ 1 వరకు అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు AVAS..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sound Alert System: సాధారణంగా వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఇంజిన్ శబ్దం వలన హారన్ కొట్టకపోయినా గుర్తించడం ఈజీ. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ, మోటార్ ఆధారంగా నడవడంతో శబ్దం రాదు. ఫలితంగా వెనక నుంచి వెహికిల్స్ వస్తున్నా పాదచారులు లేదా ఇతర వాహనదారులు గుర్తించడం చాలా కష్టం అవుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు వెహికల్ అలర్ట్ సిస్టంను తప్పనిసరి చేసింది.
Read Also: Traffic Challan : చెప్పులు వేసుకొని బైక్ నడిపితే జరిమానా..?
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
ఇక, 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు వెహికల్ అలర్ట్ సిస్టమ్ అమర్చడం తప్పనిసరి కానుంది. రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ పేర్కొనింది. 2026 అక్టోబర్ 1వ తేదీ తర్వాత తయారయ్యే అన్ని కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు AVAS సౌకర్యంతోనే రోడ్లపైకి రావాలని మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, వాహనాలు కదిలే సమయంలో ఈ సిస్టమ్ కృత్రిమ శబ్దాన్ని విడుదల చేస్తుంది. దీని వలన పాదచారులు, రోడ్డుపై ఉన్న ఇతర ప్రయాణికులు వాహనం వస్తోందని ముందుగానే గుర్తించే అవకాశం ఉంది. ఏఐఎస్-173 ప్రమాణాల ప్రకారం శబ్ద స్థాయిలతో ఈ సౌండ్ సిస్టమ్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలకు AVAS వినియోగాన్ని తప్పనిసరి చేశాయి. అలాగే, భారత్లో కూడా ఈ నిబంధన అమల్లోకి రానుంది.
తాజావార్తలు
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..