Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..
- భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం కష్టం
- ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదు
- భారత ప్రభుత్వ విధానాలు..పాలనలో మెరుగుదల అవసరం
- చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది
- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ‘ELCIA టెక్ సమ్మిట్ 2024’లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు. భారతదేశం ఈ రంగంలో ముందుకు సాగాలంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలనలో మెరుగుదల అవసరం అని ఆయన అన్నారు. ‘హబ్’, ‘గ్లోబల్ లీడర్’ వంటి పెద్ద పదాలను వాడకుండా ఉండాలని మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్మార్కెట్లు,హోమ్ డిపోలలో 90% వస్తువులను చైనాలో తయారు చేస్తారు. వారి ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) భారతదేశం కంటే ఆరు రెట్లు పెద్దది. అటువంటి పరిస్థితిలో.. భారతదేశం తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పడం చాలా పెద్ద విషయం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Sonam Wangchuk: లడఖ్పై కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
కారణాలను వివరించారు..
ఐటీ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. అదే సమయంలో.. “తయారీ రంగంలో దేశీయ సహకారం ఎక్కువగా ఉంది. తయారీ రంగం విజయంలో ప్రభుత్వ పాత్ర కీలకం. దురదృష్టవశాత్తు, భారతదేశం వంటి దేశంలో.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, వేగం, శ్రేష్ఠతలో ఇంకా మెరుగుదల అవసరం. తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య కనీస జోక్యం కావాలి. మార్కెట్ పరిస్థితిని బాగా అంచనా వేయడానికి.. విలువను జోడించడానికి వ్యాపారవేత్తలు సాధారణ గణిత నమూనాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. వ్యాపారవేత్తలు మార్కెట్ను అంచనా వేయడం నేర్చుకోవాలి. ఎంత మార్కెట్ను కైవసం చేసుకోగలదో అంచనా వేయాలి. మార్కెట్లో ఉన్న అన్ని ఇతర ఆలోచనల కంటే ఎక్కువ విలువను తీసుకురావడానికి వారు సాధారణ గణిత నమూనాలను సృష్టించగలగాలి. విజయానికి ఈ జ్ఞానం, ప్రతిభ అవసరం.” అని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!