Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Will Go On Fast From August 15 If Centre Doesnt Hold Talks On Ladakh Sonam Wangchuk

Sonam Wangchuk: లడఖ్‌పై కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..

Published Date :July 28, 2024 , 9:03 pm
By BV Reddy
  • లడఖ్‌పై కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..
  • ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్షకు ప్లాన్..
  • రాష్ట్రహోదా.. ఆరో షెడ్యూల్‌లో లడఖ్‌ని చేర్చాలని డిమాండ్..
Sonam Wangchuk: లడఖ్‌పై కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sonam Wangchuk: కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణ డిమాండ్లపై పర్యావరణ కార్యకర్తల కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం లడఖ్ అధికారుల్ని చర్చలకి ఆహ్వానించకుంటే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ఆదివారం హెచ్చరించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లడఖ్ అపెక్స్ బాడీ లెహ్ (ABL) మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఇటీవల కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్ పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీకి తమ డిమాండ్లతో మెమోరాండం సమర్పించారు.

ఎన్నికల సమయంలో తాను ప్రభుత్వాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కోరుకోలేదని, ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కుదురుకున్న తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. మెమోరాండం సమర్పించిన తర్వాత కేంద్రం తమ నేతల్ని చర్చలకు ఆహ్వానిస్తుందని అనుకుంటున్నామని, లేకపోతే ఆగస్టు 15 నుంచి రెండో రౌండ్ నిరసనల్ని ప్రారంభిస్తామని చెప్పారు. దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తానను 28 రోజుల నిరాహారదీక్ష ప్రారంభిస్తామని చెప్పారు.

పర్యావరణంగా బలహీనంగా ఉన్న లడఖ్ ప్రాంతంలో వనరుల దోపిడిని అడ్డుకోవడంతో పాటు ఈ ప్రాంతానికి గిరిజన ప్రాంత హోదా, పూర్తి రాష్ట్ర హోదాను అందిస్తామనే వాగ్దానాన్ని ప్రభుత్వం ఉపసంహరించున్నట్లు ఆయన ఆరోపించారు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC) అనుమతి లేకుండానే లడఖ్‌లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భూమిని కేటాయిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ కౌన్సిల్‌ని పట్టించుకోకుండా పై నుంచే అనుమతుల్ని ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో లడఖ్ ప్రజలు భయపడుతున్నారని చెప్పారు.

Read Also: VIDEO: కుమారస్వామి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం.. మీడియాతో సమావేశంలో ఘటన..

ఏడాదిలో 320 రోజుల పాటు ఎండ ఉండే లడఖ్ ప్రాంతం, సౌర విద్యుత్ ఉత్పత్తికి హాట్ స్పాట్‌గా ఉంది. ఇక్కడ నుంచి 35 GW సౌర విద్యుత్‌తో పాటు 100 GW ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కేవలం సోలార్ ఎనర్జీ కోసం ఇక్కడి ప్రజలు, వన్యప్రాణుల మనుగడను పణంగా పెట్టకూడదని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనేందుకు మోడీ ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసింది, కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ని నిషేధించడంతో పాటు, వారు లడఖ్‌ని కార్బన్ న్యూట్రల్‌గా ప్రకటించాలని కానీ ఇవి అమలు కావడం లేదని చెప్పారు.

ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందు వాంగ్‌చుక్ 21 రోజుల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారు. లడఖ్‌కి రాష్ట్ర హోదాతో పాటు పర్యవరణంగా బలహీనంగా ఉన్న ప్రాంతాన్ని పరిశ్రమల నుంచి కాపాడటానికి ఈ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత లడఖ్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం వివక్షకు గురైందని బౌద్ధులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. ఈ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చడం వల్ల రాష్ట్రంలోని శాసన, న్యాయ, పరిపాలన స్వయంప్రతిపత్తి అటానమస్ డిస్ట్రిట్ కౌన్సిల్(ADC) ఏర్పాటుకు దారి తీస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jammu kashmir
  • Ladakh
  • Sonam Wangchuk

తాజావార్తలు

  • SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..

  • Pawan Kalyan: ఓనూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం.. స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా

  • PAK vs BAN: మొన్నటి వరకు చెట్టాపట్టాల్, ఇప్పుడు మాటల యుద్ధాలు.. ఒక్క ‘‘రనౌట్’’ పరిస్థితిని మార్చింది..

  • Sri Rama Navami: మీ ఇంటికే భద్రాద్రి రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఇలా చేస్తే చాలు.!

  • BCCI Naman Awards: లెజెండ్స్‌కు బీసీసీఐ సలాం! రాహుల్ ద్రవిడ్, రోజర్ బిన్నీ, మిథాలీ రాజ్‌లకు అత్యున్నత పురస్కారాలు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions