Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..
- భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం కష్టం
- ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదు
- భారత ప్రభుత్వ విధానాలు..పాలనలో మెరుగుదల అవసరం
- చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది
- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ‘ELCIA టెక్ సమ్మిట్ 2024’లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు. భారతదేశం ఈ రంగంలో ముందుకు సాగాలంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలనలో మెరుగుదల అవసరం అని ఆయన అన్నారు. ‘హబ్’, ‘గ్లోబల్ లీడర్’ వంటి పెద్ద పదాలను వాడకుండా ఉండాలని మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్మార్కెట్లు,హోమ్ డిపోలలో 90% వస్తువులను చైనాలో తయారు చేస్తారు. వారి ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) భారతదేశం కంటే ఆరు రెట్లు పెద్దది. అటువంటి పరిస్థితిలో.. భారతదేశం తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పడం చాలా పెద్ద విషయం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Sonam Wangchuk: లడఖ్పై కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..
Also Read
- Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Smartphone Price Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
కారణాలను వివరించారు..
ఐటీ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. అదే సమయంలో.. “తయారీ రంగంలో దేశీయ సహకారం ఎక్కువగా ఉంది. తయారీ రంగం విజయంలో ప్రభుత్వ పాత్ర కీలకం. దురదృష్టవశాత్తు, భారతదేశం వంటి దేశంలో.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, వేగం, శ్రేష్ఠతలో ఇంకా మెరుగుదల అవసరం. తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య కనీస జోక్యం కావాలి. మార్కెట్ పరిస్థితిని బాగా అంచనా వేయడానికి.. విలువను జోడించడానికి వ్యాపారవేత్తలు సాధారణ గణిత నమూనాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. వ్యాపారవేత్తలు మార్కెట్ను అంచనా వేయడం నేర్చుకోవాలి. ఎంత మార్కెట్ను కైవసం చేసుకోగలదో అంచనా వేయాలి. మార్కెట్లో ఉన్న అన్ని ఇతర ఆలోచనల కంటే ఎక్కువ విలువను తీసుకురావడానికి వారు సాధారణ గణిత నమూనాలను సృష్టించగలగాలి. విజయానికి ఈ జ్ఞానం, ప్రతిభ అవసరం.” అని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!