Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..
- భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం కష్టం
- ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదు
- భారత ప్రభుత్వ విధానాలు..పాలనలో మెరుగుదల అవసరం
- చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది
- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ‘ELCIA టెక్ సమ్మిట్ 2024’లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు. భారతదేశం ఈ రంగంలో ముందుకు సాగాలంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలనలో మెరుగుదల అవసరం అని ఆయన అన్నారు. ‘హబ్’, ‘గ్లోబల్ లీడర్’ వంటి పెద్ద పదాలను వాడకుండా ఉండాలని మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్మార్కెట్లు,హోమ్ డిపోలలో 90% వస్తువులను చైనాలో తయారు చేస్తారు. వారి ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) భారతదేశం కంటే ఆరు రెట్లు పెద్దది. అటువంటి పరిస్థితిలో.. భారతదేశం తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పడం చాలా పెద్ద విషయం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Sonam Wangchuk: లడఖ్పై కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
కారణాలను వివరించారు..
ఐటీ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. అదే సమయంలో.. “తయారీ రంగంలో దేశీయ సహకారం ఎక్కువగా ఉంది. తయారీ రంగం విజయంలో ప్రభుత్వ పాత్ర కీలకం. దురదృష్టవశాత్తు, భారతదేశం వంటి దేశంలో.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, వేగం, శ్రేష్ఠతలో ఇంకా మెరుగుదల అవసరం. తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య కనీస జోక్యం కావాలి. మార్కెట్ పరిస్థితిని బాగా అంచనా వేయడానికి.. విలువను జోడించడానికి వ్యాపారవేత్తలు సాధారణ గణిత నమూనాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. వ్యాపారవేత్తలు మార్కెట్ను అంచనా వేయడం నేర్చుకోవాలి. ఎంత మార్కెట్ను కైవసం చేసుకోగలదో అంచనా వేయాలి. మార్కెట్లో ఉన్న అన్ని ఇతర ఆలోచనల కంటే ఎక్కువ విలువను తీసుకురావడానికి వారు సాధారణ గణిత నమూనాలను సృష్టించగలగాలి. విజయానికి ఈ జ్ఞానం, ప్రతిభ అవసరం.” అని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!