Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..
- భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం కష్టం
- ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదు
- భారత ప్రభుత్వ విధానాలు..పాలనలో మెరుగుదల అవసరం
- చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది
- ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ‘ELCIA టెక్ సమ్మిట్ 2024’లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు. భారతదేశం ఈ రంగంలో ముందుకు సాగాలంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలనలో మెరుగుదల అవసరం అని ఆయన అన్నారు. ‘హబ్’, ‘గ్లోబల్ లీడర్’ వంటి పెద్ద పదాలను వాడకుండా ఉండాలని మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్మార్కెట్లు,హోమ్ డిపోలలో 90% వస్తువులను చైనాలో తయారు చేస్తారు. వారి ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) భారతదేశం కంటే ఆరు రెట్లు పెద్దది. అటువంటి పరిస్థితిలో.. భారతదేశం తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పడం చాలా పెద్ద విషయం.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Sonam Wangchuk: లడఖ్పై కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
కారణాలను వివరించారు..
ఐటీ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. అదే సమయంలో.. “తయారీ రంగంలో దేశీయ సహకారం ఎక్కువగా ఉంది. తయారీ రంగం విజయంలో ప్రభుత్వ పాత్ర కీలకం. దురదృష్టవశాత్తు, భారతదేశం వంటి దేశంలో.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, వేగం, శ్రేష్ఠతలో ఇంకా మెరుగుదల అవసరం. తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య కనీస జోక్యం కావాలి. మార్కెట్ పరిస్థితిని బాగా అంచనా వేయడానికి.. విలువను జోడించడానికి వ్యాపారవేత్తలు సాధారణ గణిత నమూనాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. వ్యాపారవేత్తలు మార్కెట్ను అంచనా వేయడం నేర్చుకోవాలి. ఎంత మార్కెట్ను కైవసం చేసుకోగలదో అంచనా వేయాలి. మార్కెట్లో ఉన్న అన్ని ఇతర ఆలోచనల కంటే ఎక్కువ విలువను తీసుకురావడానికి వారు సాధారణ గణిత నమూనాలను సృష్టించగలగాలి. విజయానికి ఈ జ్ఞానం, ప్రతిభ అవసరం.” అని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!