March 31st: త్వరపడండి.. మరో మూడు రోజుల్లో ముగుస్తున్న గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చి 31తో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని పనులకు గడువు తేదీని పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ గడువు తేదీని పొడిగించే పరిస్థితులు కనిపించడం లేదు. కావున మరో మూడురోజుల్లో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ కింది పనులను పూర్తి చేయకుంటే ఇప్పుడే పూర్తి చేయండి.
★ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మార్చి 31తో గడువు ముగుస్తోంది. ఆ తర్వాత ఐటీ రిటర్నులను సమర్పించడం వీలుకాదు. అందువల్ల ఇంకమ్ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు మార్చి 31లోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
★ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకేజీని ఇంకా చాలా మంది ఉద్యోగులు పూర్తి చేయలేదు. ఆధార్తో పాన్ను అనుసంధానం చేసేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. గతంలో ఈ గడువును కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది. ఒకవేళ మార్చి 31లోగా మీరు ఆధార్-పాన్ లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. అందువల్ల ఇప్పుడే ఆధార్-పాన్ లింకేజీని పూర్తి చేయండి. లేకపోతే రూ.10వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు.
★ మీ బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయండి. పాన్, ఆధార్, అడ్రస్ ఐడెంటిటీల వివరాలను మార్చి 31లోగా సమర్పించండి. బ్యాంకు ఖాతాలో కేవైసీ పూర్తి చేయకుంటే మీరు చాలా ప్రయోజనాలను పొందలేరు. అందువల్ల ఈ పనిని మీ బ్యాంక్ శాఖకు వెళ్లి పూర్తి చేయండి.
★ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం ప్రయోజనాలను పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా మార్చి 31లోగా ఈ-కేవైసీ అప్డేట్ చేయాలి.
★ వివాద్ సే విశ్వాస్ పథకంలో భాగంగా పన్ను బాకీలను కూడా మార్చి 31లోగా చెల్లించండి. ఇలా చెల్లిస్తే వడ్డీతో పాటు అపరాధ రుసుములను రద్దు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల వెల్లడించింది. కనుక ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి.
★ తెలంగాణలో వాహనాల పెండింగ్ ఛలానాలపై ప్రకటించిన డిస్కౌంట్ మార్చి 31లోగా ముగియనుంది. దీంతో వాహనాలపై ఛలానాలు ఉన్నవారు ఇప్పుడే డిస్కౌంట్ ఉపయోగించుకుని చెల్లింపులు చేయండి.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!