India-China : ట్రంప్ ప్రకటనతో చైనాకు షాక్.. భారత్కు లక్కీ ఛాన్స్ గురూ.. !
- డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
- చైనాపై ఎక్కువ టారిఫ్లు విధిస్తామని ప్రకటన
- అమెరికాలో పెరగనున్న చైనా వస్తువుల రేటు
- ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోనున్న భారత్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి పొరుగు దేశం చైనాకు నిత్యం ఇబ్బందికర వార్తలు వస్తూనే ఉన్నాయి. చైనాపై ఎక్కువ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. దీని వల్ల అమెరికాలో చైనా వస్తువుల రేటు పెరుగుతుంది. దీంతో విక్రయాలు తగ్గి చైనా కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అమెరికాకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఐదు కీలక రంగాలకు వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ 5 రంగాల్లో ఎగుమతులను పెంచడం ద్వారా చైనాతో నేరుగా పోటీ పడాలని భారత్ యోచిస్తోంది. ఈ 5 రంగాల్లో ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, రసాయనాలు, తోలుతో చేసిన పరికరాలు ఉన్నాయి.
ట్రంప్ ప్లాన్ ఏంటి?
వచ్చే ఏడాది జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారం చేపట్టిన తర్వాత కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలను పెంచుతామని ట్రంప్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. చైనా నుంచి అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయడం ఖరీదుగా మారుతుంది. దీంతో ఈ చైనా వస్తువులను అమెరికాలో విక్రయించాలంటే వాటి రేటు పెంచాల్సి వస్తుంది.
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
భారతదేశ ప్రణాళిక ఏమిటి?
ఈ సందర్భంగా భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ.. “ఈసారి మనం చురుగ్గా ఉండాలి. ఎలక్ట్రానిక్స్, బొమ్మలు, బట్టలు, రసాయనాలు, తోలు రంగాలకు చెందిన వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ వ్యూహానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఈ వస్తువులను ఎగుమతి చేసేందుకు అవసరమయ్యే పెద్ద ఫ్యాక్టరీల సామర్థ్యం అవసరం. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ (ఎంఎఐ) పథకం కింద మరిన్ని నిధులను కోరుతున్నాం. అలాగే ఎగుమతులపై జీడీపీ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ప్రణాళిక ప్రకారం.. కనీసం మూడేళ్లపాటు అమెరికాపై దృష్టి పెట్టాలి. యుఎస్ మార్కెట్లో దూకుడును భారత్ అందిపుచ్చుకోవాలి. ” అని వెల్లడించారు.
భారత్- అమెరికా మధ్య వాణిజ్యం ఎలా ఉంది?
గత కొన్నేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. 2017 -2023 మధ్య ఎగుమతులు $36.8 బిలియన్లకు చేరుకున్నాయి. స్మార్ట్ఫోన్లు, టెలికాం పరికరాల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. బట్టలు, మోటారు వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు మొదలైన వాటి ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.
చైనాపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
భారత్ తన ప్రణాళికలో విజయం సాధిస్తే చైనాను వస్తువుల ఎగుమతుల్లో ఓడించవచ్చు. భారత్పై టారిఫ్ల విధింపుపై ట్రంప్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటువంటి పరిస్థితిలో.. చైనా వస్తువులు అమెరికాలో ఎక్కువ రేటు పలుకుతాయి. భారతీయ వస్తువులు చౌకగా మారుతాయి. చైనీస్ వస్తువులు అమ్మకాలు తగ్గుతాయి. దీని కారణంగా భారతీయ కంపెనీలు అమెరికన్ మార్కెట్లో సులభంగా రాణించవచ్చు. దీని ప్రభావం చైనా కంపెనీలు, చైనా ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
-
JD Chakravarthy: “అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!” జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో