Hurun India Rich List 2023: అదానీని వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి ముకేష్ అంబానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
హూరున్ ఇండియా మరియు 360 వన్ వెల్త్ సంయుక్త నివేదిక ప్రకారం హూరున్ ఇండియా రిచ్లిస్ట్ 2023ని విడుదల చేసింది. ఇది భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితా 12వ ఎడిషన్ని సూచిస్తుంది. ముకేష్ అంబానీ, అతని కుటుంబం ఆస్తుల విలువ రూ.. 8,08,700 కోట్ల నికర విలువతో అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదాని, అతని కుటుంబ ఆస్తుల విలువ రూ.4,74,800 కోట్లతో, సైరస్ పూనావల్లా అండ్ ఫ్యామిలీ రూ.2,78,500 కోట్లతో తదుపరి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..

Read Also: Israel-Hamas: బందీలకు ఏమైనా జరిగితే ఊరుకోమన్న ఇజ్రాయిల్.. అలా అయితే బందీలను ఉరితీస్తామన్న హమాస్..
ఈ ఏడాది విడుదలైన హూరున్ రిపోర్ట్ ప్రకారం 1319 మంది వ్యక్తులు రూ. 1000 కోట్లకుపైగా నికర ఆస్తుల విలువను కలిగి ఉన్నారు. వీరిలో 219 మంది ఆస్తుల విలువ పెరిగింది. కొత్తగా ఈ జాబితాలోకి 219 మంది చేరారు. ఈ నివేదిక ప్రకారం.. ఈ ధనవంతుల సంపద సింగపూర్, యూఏఈ, సౌదీ అరేబియాల మొత్తం జీడిపిని అధిగమించి రూ. 109 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యక్తుల సంపద 8.5 శాతం పెరిగితే.. సగటున వ్యక్తుల సంపద 9.3 శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది.
ఈ జాబితాలోని 278 మంది కొత్త వారితో సహా మొత్తం 1054 మంది వ్యక్తుల సంపద వృద్ధి చెందడం లేదా స్థిరంగా ఉండటాన్ని నివేదిక హైలెట్ చేసింది. 264 మంది వ్యక్తుల సంపద క్షీణించినట్లు, 55 మంది ఈ జాబితా నుంచి తప్పుకున్నట్లు తెలిపింది. భారతదేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు, ఇది గతేడాదితో పోలిస్తే 38 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పరిశ్రయలు, పారిశ్రామిక ఉత్పత్తులు, మెటల్ అండ్ మైనింగ్ జాబితాలోకి అత్యధిక మంది కొత్తగా చేరారు.. ఫార్మా నుంచి 133 మంది కొత్త వారు జాబితాలోకి వచ్చారు. జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా(20) అతి చిన్న వయస్సు సంపన్నుడిగా నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!