Post Office Scheme:ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. వద్దన్నా లక్షల్లో లాభం!
- లాభాలనిచ్చే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్
- ఇన్వెస్ట్ చేస్తే వద్దన్నా లక్షల్లో లాభం!
- ఇందులో రూ. 100 నుంచి, గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్ ను అమలు చేస్తున్నది. మరి పోస్టాఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి లక్షల్లో లాభాలు అందుకోవాలంటే మతిపోయే స్కీమ్ ఉంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్.
ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వద్దన్నా లక్షల్లో లాభం అందుకోవచ్చు. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు 6.7 శాతం వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్ పై ఆధారపడి ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. అయితే ఇందులో తల్లిదండ్రులు తమ గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
కాగా ఈ పథకంలో నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి రూ. 7 లక్షలు పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ప్రతి నెలా రూ. 10 వేలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి లక్ష 20 వేలు అవుతుంది. ఐదు సంవత్సరాలలో మీరు మొత్తం 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై వడ్డీ రేటు 6.7 చొప్పున రూ. 1 లక్ష 13 వేల 659 వడ్డీ ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం ఫండ్ రూ. 7 లక్షల 13 వేల 659 చేతికి అందుతుంది.
తాజావార్తలు
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!