GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు
- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. పెద్ద వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు విధానాన్ని ఆటోమేట్ చేయడం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఒక రోజు ముందు.. అంటే సెప్టెంబర్ 11న అధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యాలయ మెమోరాండం జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్.. ఏడాది విరామం తర్వాత సమావేశం కానుంది.
Also Read
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
ఏడాది తర్వాత భేటీ
జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం 2025 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగింది. ఆ సమావేశంలో వస్తు సేవల పన్ను (GST) రేట్లు, శ్లాబ్లలో భారీ మార్పులకు కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. 2025 సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రెండు ప్రధాన శ్లాబ్లుగా 5 శాతం, 18 శాతంగా మారింది. అత్యంత విలాసవంతమైన వస్తువులు, పాపపు వస్తువులకు (Sin Goods) మాత్రమే 40 శాతం అత్యధిక రేటును నిర్ణయించారు. అంతకుముందు 2017 జూలై 1 నుంచి అమల్లో ఉన్న 5, 12, 18, 28 శాతం నాలుగు శ్లాబ్ల స్థానంలో ఈ కొత్త విధానం తీసుకొచ్చారు.
రిజిస్ట్రేషన్ సులభతరం?
సెప్టెంబర్ 12న జరగనున్న 57వ సమావేశంలో నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్ను బదిలీ చేసే వ్యాపారాల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే అంశాన్ని కౌన్సిల్ పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు రూ.2.5 లక్షలకు పైగా పన్ను క్రెడిట్ను బదిలీ చేసే పెద్ద వ్యాపారాలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఇచ్చే విధానంలో కేంద్ర జీఎస్టీ విభాగాలు, వివిధ రాష్ట్రాల విభాగాల మధ్య ఏకరూపత లేదు. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో అనిశ్చితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకరించే ప్రతిపాదనను కౌన్సిల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలో ఆటోమేషన్తో పాటు ఇతర మార్పులపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు కొత్త విధానాలను పరిశీలించనున్నట్లు సమాచారం.
చిన్న వ్యాపారాలకు..
చిన్న, తక్కువ రిస్క్ ఉన్న వ్యాపారాల కోసం సరళీకృత జీఎస్టీ రిజిస్ట్రేషన్ విధానాన్ని 2025 సెప్టెంబర్లో జరిగిన 56వ కౌన్సిల్ సమావేశంలోనే ఆమోదించారు. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ వ్యవస్థ డేటా విశ్లేషణ ఆధారంగా గుర్తించిన చిన్న, తక్కువ రిస్క్ వ్యాపారాలు లేదా తమ నెలవారీ అవుట్పుట్ పన్ను బాధ్యత రూ.2.5 లక్షలకు మించదని స్వీయ అంచనా వేసుకున్న వ్యాపారాలు ఈ సరళీకృత విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో CGST, SGST/UTGST, IGST అన్నీ కలిపి పన్ను బాధ్యతను లెక్కిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1.68 కోట్ల వ్యాపారాలు జీఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి.
తాజావార్తలు
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!