Site icon NTV Telugu

Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!

Goldrates

Goldrates

పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు పాటు పరుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ రెండు రోజులకే మళ్లీ ధరలు షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.380 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: Maharashtra: వైద్య పరీక్ష విషయంలో వివాదం.. క్షణికావేశంలో ఆస్పత్రిలోనే వైద్యురాలు ఆత్మహత్య

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.380 పెరగగా రూ.1, 25, 460 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.350 పెరగగా రూ.1, 15, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 280 పెరగగా రూ.94, 090 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి

వెండి ధరలు మాత్రం ఉపశమనం కలిగిస్తున్నాయి. కిలో వెండి ధరపై రూ.3,000 తగ్గి రూ.1, 56, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 71, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 56, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Trump-Israel: అలా చేస్తే మా మద్దతు కోల్పోతారు.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్

Exit mobile version