దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. బుధవారం తగ్గుముఖం పట్టిన ధరలు గురువారం నాటికి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఒకేసారి రూ.230 పెరిగింది. దీంతో తులం బంగారం ధర సుమారు రూ.52 వేలకు చేరువైంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వెండి ధరలు ఇలా..: దేశంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.66,000గా నమోదైంది. విజయవాడ, విశాఖలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో గురువారం వెండి ధర తగ్గింది. కిలోవెండి ధర రూ.60,200గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 60,200 వద్ద కొనసాగుతోంది.