GIFT City: సింగపూర్, దుబాయ్లకు ధీటుగా.. మన దేశంలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ (GIFT City) అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ఎలా ఎదుగుతోంది, పెట్టుబడిదారులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇన్నాళ్లూ విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులు సింగపూర్ లేదా దుబాయ్ వంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఎంతోమంది మధ్యవర్తులు, కఠినమైన నిబంధనలు, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా ఉండేది. కానీ ఇప్పుడు మన దేశంలోనే ఉన్న ‘గిఫ్ట్ సిటీ’ ఈ పరిస్థితిని మారుస్తోంది. విదేశీయులు లేదా ఎన్ఆర్ఐలు (NRIs) భారత్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎదురయ్యే పన్నులు, కరెన్సీ మార్పిడి వంటి ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తోంది.
ఒకే చోట అన్ని అనుమతులు..
గిఫ్ట్ సిటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ , స్టాక్ మార్కెట్ వంటి అన్ని విభాగాలకు IFSCA అనే ఒకే ఒక సంస్థ నిబంధనలను పర్యవేక్షిస్తుంది. దీనివల్ల పెట్టుబడిదారులు వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పనులు వేగంగా పూర్తవుతాయి. ఇది సింగపూర్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
ఎన్ఆర్ఐలకు సులభమైన మార్గం..
భారతదేశ చట్టాల ప్రకారం గిఫ్ట్ సిటీని ఒక ‘విదేశీ భూభాగం’గా పరిగణిస్తారు. దీనివల్ల ఎన్ఆర్ఐలు తమ వద్ద ఉన్న డాలర్లు లేదా యూరోలను రూపాయిల్లోకి మార్చకుండానే నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే తమకు వచ్చిన లాభాలను తిరిగి విదేశాలకు తీసుకెళ్లడం కూడా చాలా సులభం. భారత్కు రాకుండానే వీడియో కేవైసీ (Video KYC) ద్వారా ఖాతాలు తెరిచే సదుపాయం కూడా ఉంది. పన్నుల విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పించింది.
సాధారణంగా విదేశాల్లో పెట్టుబడి పెట్టాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. గిఫ్ట్ సిటీ ద్వారా గ్లోబల్ స్టాక్స్ , ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినంత సులభంగా మారుతోంది. ఇది క్రమంగా పెట్టుబడిదారుల అలవాట్లను మారుస్తూ.. అంతర్జాతీయ మార్కెట్ను మనకు దగ్గర చేస్తోంది.
వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక హబ్..
సెప్టెంబర్ 2025 నాటికి ఉన్న లెక్కల ప్రకారం.. గిఫ్ట్ సిటీలోని బ్యాంకింగ్ ఆస్తుల విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇప్పటికే ఇక్కడ 1,000 కంటే ఎక్కువ సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి .. 20,000 మందికి పైగా నిపుణులు ఇక్కడ పని చేస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా ఎంత వేగంగా ఎదుగుతుందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
గిఫ్ట్ సిటీ ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, నిబంధనలలో ఉన్న స్పష్టత పెట్టుబడిదారులకు నమ్మకాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ చేరితే, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడం ఖాయం.
తాజావార్తలు
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?