Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి పెన్షన్ అనేది ప్రధాన ఆధారం. అయితే.. ప్రస్తుత కాలంలో వస్తున్న వెయ్యి రూపాయల కనిష్ట పెన్షన్ ఏ మూలకూ సరిపోవడం లేదన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో.. లక్షలాది మంది ఈపీఎస్-95 (EPS-95) పెన్షనర్లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
రూ. 7,500లకు పెన్షన్ పెంపు..?
Also Read
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం 'ఆక్సిజన్'.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
- Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ మేరకు, కనిష్ట పెన్షన్ను ప్రస్తుతమున్న రూ. 1,000 నుంచి రూ. 7,500లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. కార్మిక సంఘాలు, పార్లమెంటరీ కమిటీ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో.. దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సామాన్యులకు, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల రిటైర్డ్ ఉద్యోగులకు ఇది పెద్ద వరం కానుంది.
ముఖ్యమైన మార్పులు ఇవే..
ఈపీఎఫ్ఓ (EPFO) తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. త్వరలో ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడం ద్వారా కాగితపు పని తగ్గించి, వేగంగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయోజనం ఎవరికి..?
పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది వృద్ధులకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలుస్తుంది. కేవలం పెన్షన్ పెంచడమే కాకుండా, పీఎఫ్ నగదును సులభంగా పొందేలా చేస్తున్న మార్పులు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచుతాయి. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఈ వార్త కోట్లాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
తాజావార్తలు
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
-
Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
-
RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!