100 Percent PF Withdrawal: ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. ఇకపై పీఎఫ్ ఖాతాలో మొత్తం డబ్బు తీసుకోడానికి గ్రీన్ సిగ్నల్
100 Percent PF Withdrawal: దీపావళి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో జరిగిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 238వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇప్పుడు PF ఖాతాల నుంచి 100% నిధుల ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించే దిశగా ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మక అడుగుగా మారబోతుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా విశ్వసం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
READ ALSO: Mamitha Baiju : ‘డ్యూడ్’ కోసం రాత్రంతా ప్రాక్టీస్ చేసి ఫోకస్ చేశా!
Also Read
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Cooking Oil Price: సామాన్యుడికి మరో బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
ఈ సమావేశంలో ఉద్యోగులు ఇప్పుడు వారి PF ఖాతాల నుంచి 100% ఉపసంహరించుకోవచ్చని నిర్ణయం తీసుకున్నారు. గతంలో పదవీ విరమణ లేదా నిరుద్యోగం తర్వాత మాత్రమే పూర్తి ఉపసంహరణ సాధ్యమయ్యేది. పలు నివేదికల ప్రకారం.. ఈ సమావేశంలో 13 సంక్లిష్టమైన పాక్షిక ఉపసంహరణ నియమాలను మూడు సరళీకృత వర్గాలుగా కలిపారు. గతంలో పోలిస్తే ఇప్పుడు విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం ఐదు సార్లు పీఎఫ్ ఉపసంహరణలు అనుమతించారు. ఇంకా పాక్షిక ఉపసంహరణలకు కనీస సేవా వ్యవధి 12 నెలలకు పెంచారు. ప్రత్యేక పరిస్థితులలో సభ్యులు ఇకపై ఉపసంహరణకు కారణాన్ని అందించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. EPFO సభ్యులు తమ ఖాతా బ్యాలెన్స్లో కనీసం 25% “కనీస బ్యాలెన్స్”గా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్దేశించారు. ఇది వారికి 8.25% వార్షిక వడ్డీ రేటు, కాంపౌండింగ్ ప్రయోజనాలను అందేలా చేస్తుంది.
అందుబాటులోకి ఆటో-క్లెయిమ్ సౌకర్యం..
EPFO 100% ఆటో-సెటిల్మెంట్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది ఉపసంహరణలను వేగవంతం చేస్తుందని, మరింత పారదర్శకంగా చేస్తుంది. అదనంగా చివరి PF ఉపసంహరణ వ్యవధిని రెండు నెలల నుంచి 12 నెలలకు పొడిగించారు. అలాగే పెన్షన్ ఉపసంహరణ వ్యవధిని 36 నెలలకు పెంచారు. ఈ నిర్ణయం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం అందిస్తుందని, వారి పదవీ విరమణ నిధులను రక్షించడంలో సహాయపడుతుందని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. EPFO తాజా చర్యలు ఉద్యోగుల జీవితాలను సులభతరం చేయడమే కాకుండా ఆర్థిక సౌలభ్యాన్ని కూడా పెంచుతుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉద్యోగులు వారి అవసరాలకు అనుగుణంగా ఎటువంటి సంక్లిష్టమైన విధానాలు లేకుండా, వారి నిధులను ఉపసంహరించుకోగలరు.
READ ALSO: Why Humans Cry: ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకునే ఏకైక జీవులు ఏవో తెలుసా! అసలు ఏడుపు ఎందుకు వస్తుంది?
తాజావార్తలు
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
-
Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం… పగలు సెగలు..సాయంత్రం జల్లులు
-
SRH vs KKR IPL 2026: అరుదైన రికార్డు సాధించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా..
-
Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
-
Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!