Dmart Plans: డీమార్ట్ విస్తరణ ప్రణాళిక. స్టోర్ల సంఖ్యను ఐదు రెట్లు పెంచటంపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dmart Plans: ఇండియన్ రిటైల్ కార్పొరేషన్ డీమార్ట్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రిలయెన్స్ రిటైల్కి పోటీగా ప్లాన్లు వేస్తోంది. స్టోర్ల సంఖ్యను భారీగా పెంచటంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టోర్ల సంఖ్య 284 కాగా వాటిని 1500కు పెంచేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు డీమార్ట్ సీఈఓ నెవిల్లె నొరొన్హా వెల్లడించారు. అయితే.. ఈ విస్తరణ ప్రణాళికను ఎప్పటిలోగా, ఎంత పెట్టుబడితో చేపడతామనే వివరాలను స్పష్టం చేయలేదు. పోటీ ప్రపంచంలో రానున్న 20 ఏళ్లపాటు తమకు ఎలాంటి ఆందోళనా లేదని ధీమా వ్యక్తం చేశారు.
క్యూ కట్టిన ఐపీఓలు
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
ఈ ఏడాది ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబీ) వద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓలు) క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో రూ.52 వేల కోట్ల విలువైన ఐపీఓలు ఉన్నాయి. 46 సంస్థలు ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్లను సమర్పించాయి. ఈ నెలలో 15వ తేదీ నాటికే 7 సంస్థలు ముందుకు రావటం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొనటంతో ఐపీఓలు వెనక్కి తిరిగొస్తున్నాయి. సెబీ, యాంజెల్ వన్, బిజినెస్ ఇన్సైడర్ ఇండియా ఈ వివరాలను వెల్లడించాయి.
Rakesh Jhunjhunwala: కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్.. రాకేష్ ఝున్ఝున్వాలా
‘టాటా’కి పెద్ద ఆర్డర్
టాటా మోటర్స్కి పెద్ద ఆర్డర్ వచ్చింది. 921 ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం బీఎంటీసీ ఈ ఆర్డర్ ఇచ్చింది. బీఎంటీసీ అంటే.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. 12 మీటర్ల పొడవైన ఈ బస్సులను 12 ఏళ్లపాటు తయారుచేసి అందించటం, ఆపరేట్ చేయటం, మెయింటనెన్స్ చూసుకోవటం వంటి బాధ్యతలను టాటా మోటార్స్ చూసుకోవాలి. ఈ మేరకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లలో నిన్నటి ఆనందం ఆవిరైంది. ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు మాత్రమే పెరిగి 60298 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 17956 పైనే క్లోజ్ అయింది. ఇంట్రాడేలో సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ షేర్లు 6% నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్ స్టాక్స్ కొత్త శిఖరానికి చేరుకున్నాయి. 2 నెలల్లో 24 శాతం ర్యాలీ తీసింది. రూపాయి మారకం విలువ 19 పైసలు కోల్పోయి ప్రస్తుతం 79.25 వద్ద నిలకడగా ఉంది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!