Dmart Plans: డీమార్ట్ విస్తరణ ప్రణాళిక. స్టోర్ల సంఖ్యను ఐదు రెట్లు పెంచటంపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dmart Plans: ఇండియన్ రిటైల్ కార్పొరేషన్ డీమార్ట్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రిలయెన్స్ రిటైల్కి పోటీగా ప్లాన్లు వేస్తోంది. స్టోర్ల సంఖ్యను భారీగా పెంచటంపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న స్టోర్ల సంఖ్య 284 కాగా వాటిని 1500కు పెంచేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు డీమార్ట్ సీఈఓ నెవిల్లె నొరొన్హా వెల్లడించారు. అయితే.. ఈ విస్తరణ ప్రణాళికను ఎప్పటిలోగా, ఎంత పెట్టుబడితో చేపడతామనే వివరాలను స్పష్టం చేయలేదు. పోటీ ప్రపంచంలో రానున్న 20 ఏళ్లపాటు తమకు ఎలాంటి ఆందోళనా లేదని ధీమా వ్యక్తం చేశారు.
క్యూ కట్టిన ఐపీఓలు
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ఈ ఏడాది ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబీ) వద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓలు) క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో రూ.52 వేల కోట్ల విలువైన ఐపీఓలు ఉన్నాయి. 46 సంస్థలు ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్లను సమర్పించాయి. ఈ నెలలో 15వ తేదీ నాటికే 7 సంస్థలు ముందుకు రావటం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొనటంతో ఐపీఓలు వెనక్కి తిరిగొస్తున్నాయి. సెబీ, యాంజెల్ వన్, బిజినెస్ ఇన్సైడర్ ఇండియా ఈ వివరాలను వెల్లడించాయి.
Rakesh Jhunjhunwala: కింగ్ ఆఫ్ దలాల్ స్ట్రీట్.. రాకేష్ ఝున్ఝున్వాలా
‘టాటా’కి పెద్ద ఆర్డర్
టాటా మోటర్స్కి పెద్ద ఆర్డర్ వచ్చింది. 921 ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం బీఎంటీసీ ఈ ఆర్డర్ ఇచ్చింది. బీఎంటీసీ అంటే.. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. 12 మీటర్ల పొడవైన ఈ బస్సులను 12 ఏళ్లపాటు తయారుచేసి అందించటం, ఆపరేట్ చేయటం, మెయింటనెన్స్ చూసుకోవటం వంటి బాధ్యతలను టాటా మోటార్స్ చూసుకోవాలి. ఈ మేరకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ పేరిట ఒప్పందం కుదుర్చుకున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లలో నిన్నటి ఆనందం ఆవిరైంది. ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు మాత్రమే పెరిగి 60298 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 17956 పైనే క్లోజ్ అయింది. ఇంట్రాడేలో సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ షేర్లు 6% నష్టపోయాయి. ఎస్బీఐ లైఫ్ స్టాక్స్ కొత్త శిఖరానికి చేరుకున్నాయి. 2 నెలల్లో 24 శాతం ర్యాలీ తీసింది. రూపాయి మారకం విలువ 19 పైసలు కోల్పోయి ప్రస్తుతం 79.25 వద్ద నిలకడగా ఉంది.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!