Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్! పెట్రోల్ ధర ఎకంగా రూ.250?
- పెట్రోల్..డీజిల్ ధరలపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్! పెట్రోల్ ధర ఎకంగా రూ.250లకు పెరిగే అవకాశం
- తాజా నివేదికలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని గత వారం వార్తలు వచ్చాయి. ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. దీంతోపాటు చమురు కంపెనీలు కూడా లాభపడ్డాయి. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చమురు ధరలను లీటరుకు రూ.2 నుంచి 3 వరకు తగ్గించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణం..
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చౌకగా పెట్రోల్, డీజిల్ ఆశకు ఎదురుదెబ్బ తగలవచ్చు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ముడి చమురు ధర బ్యారెల్కు $ 200 వరకు ఉంది. ఇదే జరిగితే భారత్లో పెట్రోలు ధర లీటరుకు రూ.250 వరకు పెరగవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95గా ఉంది.
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
ముడి చమురు ధర ఎంత అయింది?
ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు 75 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. దీని ధర ఒక్కరోజులో దాదాపు 3 శాతం పెరిగింది. గత వారం దాని ధర బ్యారెల్కు దాదాపు $68గా ఉంది. అటువంటి పరిస్థితిలో, దాని ధర కేవలం ఒక నెలలో $ 7 పెరిగింది, ఇది 10 శాతం కంటే ఎక్కువ.
ధర మరింత పెరిగే అవకాశం ఉంది..
చమురు మార్కెట్లో ఇరాన్ ప్రధాన దేశం. ఇరాన్ రోజుకు 4 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ ప్రకారం.. ఇరాన్ చమురు నిల్వలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4 శాతం ప్రమాదంలో పడవచ్చు. అటువంటి పరిస్థితిలో.. చమురు ధరలు బ్యారెల్కు $ 20 వరకు పెరగవచ్చు.
పెట్రోల్ లీటర్ రూ.250కి దొరుకుతుంది!
కొన్ని నివేదికల ప్రకారం.. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడి చేసి నాశనం చేస్తే, ముడి చమురు ధర బ్యారెల్కు $ 100 దాటవచ్చు. స్వీడిష్ బ్యాంక్ ఎస్ఈబీ నివేదిక ప్రకారం.. ఇది జరిగితే, ముడి చమురు ధర బ్యారెల్కు $ 200 కి చేరుకోవచ్చు. కేడియా కమోడిటీ ఎమ్డీ అజయ్ కేడియా ప్రకారం, ఇది జరిగితే భారతదేశంలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 250 వరకు పెరగవచ్చు.
చమురు కంపెనీలకు భారీ లాభాలు..
దేశంలోని మూడు ప్రధాన చమురు కంపెనీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.81 వేల కోట్లు ఆర్జించాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ అత్యధికంగా లాభపడింది. ఇండియన్ ఆయిల్ దాదాపు రూ.40 వేల కోట్లు సంపాధించింది. భారత్ పెట్రోలియం రూ.26.67 వేల కోట్లు, హిందుస్థాన్ పెట్రోలియం దాదాపు రూ.14.70 వేల కోట్లు ఆర్జించాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!