USA: అదే జరిగితే.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తప్పదు?.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం
- మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించనున్న ట్రంప్
- భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
- భారత్పై టారిఫ్లు విధిస్తే విధించే అవకాశంపై ప్రస్తావన
- అదే జరిగితే వాణిజ్య యుద్ధం తప్పదని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా.. భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై టారిఫ్లు విధిస్తే అది వాణిజ్య యుద్ధానికి దారితీయొచ్చని ఆయన పేర్కొన్నారు.
నేను మద్దతు ఇవ్వను: సుబ్రహ్మణ్యం
‘‘టారీఫ్లు విధించడానికి నేను మద్దతు ఇవ్వను. అది నిజంగా చెడు చేస్తుందని నమ్ముతాను. వాణిజ్య యుద్ధానికి దారి తీయొచ్చు. ఇది ఏ దేశానికీ ప్రయోజనకరం కాదని నమ్ముతున్నాను. భారత్లో చాలా కంపెనీలు బాగా పని చేస్తున్నాయి. వాటిల్లో చాలా అమెరికాలో కూడా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి మరింత పనిచేయాలి. అప్పుడే బలపడతాం. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈనేపథ్యంలో అమెరికా-భారత్ సంబంధాలు బలపడటం ఇరుపక్షాలకు చాలా కీలకం’’ అని పీటీఐతో సుహాస్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
- Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
- E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
- India Forex Reserves: రూపాయి స్థిరత్వానికి బలం.. పెరిగిన విదేశీ మారక నిల్వలు.. 938 మిలియన్ డాలర్ల వృద్ధి
టారిఫ్ పెంచితే భారత్ జీడీపీలో మార్పులు..
గతంలో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఒకవేళ ట్రంప్ చెప్పిన సుంకాల నిబంధనలను అమలు చేస్తే, భారత జీడీపీ 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. భారత్, అమెరికా మధ్యలో 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ రేట్లను పెంచితే, భారత్ బాగా నష్టపోతుంది.
అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానం..
కాగా.. ట్రంప్ గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ తన తొలి పదవీ కాలంలో అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే. భారత్, చైనా సహా చాలా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. అలాగే అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై ఆయన కఠిన చర్యలు తీసుకోగలరు. భారత్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!