USA: అదే జరిగితే.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తప్పదు?.. యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం
- మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించనున్న ట్రంప్
- భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి కీలక వ్యాఖ్యలు
- భారత్పై టారిఫ్లు విధిస్తే విధించే అవకాశంపై ప్రస్తావన
- అదే జరిగితే వాణిజ్య యుద్ధం తప్పదని హెచ్చరిక
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాగా.. భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు సుహాస్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై టారిఫ్లు విధిస్తే అది వాణిజ్య యుద్ధానికి దారితీయొచ్చని ఆయన పేర్కొన్నారు.
నేను మద్దతు ఇవ్వను: సుబ్రహ్మణ్యం
‘‘టారీఫ్లు విధించడానికి నేను మద్దతు ఇవ్వను. అది నిజంగా చెడు చేస్తుందని నమ్ముతాను. వాణిజ్య యుద్ధానికి దారి తీయొచ్చు. ఇది ఏ దేశానికీ ప్రయోజనకరం కాదని నమ్ముతున్నాను. భారత్లో చాలా కంపెనీలు బాగా పని చేస్తున్నాయి. వాటిల్లో చాలా అమెరికాలో కూడా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి మరింత పనిచేయాలి. అప్పుడే బలపడతాం. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈనేపథ్యంలో అమెరికా-భారత్ సంబంధాలు బలపడటం ఇరుపక్షాలకు చాలా కీలకం’’ అని పీటీఐతో సుహాస్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Also Read
- Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
- Anant Ambani: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ వాచ్.. రూ.12 కోట్ల ఆ వాచ్ ప్రత్యేకతలు ఇవే!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
టారిఫ్ పెంచితే భారత్ జీడీపీలో మార్పులు..
గతంలో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఒకవేళ ట్రంప్ చెప్పిన సుంకాల నిబంధనలను అమలు చేస్తే, భారత జీడీపీ 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. భారత్, అమెరికా మధ్యలో 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ రేట్లను పెంచితే, భారత్ బాగా నష్టపోతుంది.
అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానం..
కాగా.. ట్రంప్ గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ తన తొలి పదవీ కాలంలో అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన విషయం తెలిసిందే. భారత్, చైనా సహా చాలా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను విధించారు. అలాగే అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై ఆయన కఠిన చర్యలు తీసుకోగలరు. భారత్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది.
తాజావార్తలు
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!