Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Condom Prices: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా వినియోగ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉధృతి కారణంగా, ప్రపంచవ్యాప్తంగా కండోమ్ ధరలు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరగనున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయి. యుద్ధ భయాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీ సంస్థ ‘కారెక్స్’ (Karex) ధరలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రభావం కేవలం ఒక వస్తువుకే పరిమితం కాకుండా, విమాన ప్రయాణాలు, నిత్యావసరాలపై కూడా పడనుంది.
ధరల పెరుగుదలకు కారణాలేంటంటే..
కారెక్స్ సీఈఓ గో మియా కియాట్ (Goh Miah Kiat) వెల్లడించిన వివరాల ప్రకారం.. కండోమ్ తయారీకి అవసరమైన అమ్మోనియా, సిలికాన్ ఆధారిత లూబ్రికెంట్లు వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ ముడి చమురు, ఎల్ఎన్జీ గ్యాస్లో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అక్కడ సైనిక ఆంక్షలు, నాకేబందీ కారణంగా రవాణా వ్యయం భారీగా పెరిగింది. విచిత్రంగా యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో కండోమ్స్కు డిమాండ్ 30% పెరిగింది. ఉద్యోగ భద్రత లేనప్పుడు ప్రజలు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే డిమాండ్ పెరిగిందని సంస్థ తెలిపింది. కారెక్స్ సంస్థ ఏటా 500 కోట్లకు పైగా కండోమ్స్ను తయారు చేస్తూ డ్యూరెక్స్ (Durex), ట్రోజన్ (Trojan) వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరా చేస్తోంది.
Also Read
- Swiggy Instamart: స్విగ్గీ ఇన్స్టామార్ట్లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
- Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
- Elon Musk: పాపం ఎలాన్ మస్క్కు భారీ షాక్.. ఆ హోదాను కోల్పోయిన ప్రపంచ కుబేరుడు!
- Ayush Singh: డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. కానీ ఏఐ (AI) తో నెలకు రూ.కోటి సంపాదన! ఎలాగో తెలుసా?
ఇతర రంగాలపై ప్రభావం..
హోర్ముజ్ ఉద్రిక్తతల వల్ల కేవలం కండోమ్స్ మాత్రమే కాదు, మరికొన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. అవి ఏంటంటే.. గత ఏడాదితో పోలిస్తే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ల ధరలు సగటున 24% పెరిగాయి. ఇదే సమయంలో రవాణా ఖర్చులు పెరగడంతో చక్కెర, డెయిరీ ఉత్పత్తులు, పండ్ల ధరలు కూడా పెరగనున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. హీలియం గ్యాస్ కొరత కారణంగా కంప్యూటర్ చిప్స్ తయారీ మందగించి, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!