Wipro Buyback: విప్రో ఇన్వెస్టర్లకు కాసుల పండగే.. రూ.15 వేల కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించిన ఐటీ దిగ్గజం
- రూ.210 విలువైన షేరుకు రూ.250 ఆఫర్
- మొత్తం 600 మిలియన్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wipro Buyback: స్టాక్ మార్కెట్లో నిత్యం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విప్రో ఇన్వెస్టర్లకు కంపెనీ ఒక పెద్ద ఊరట కలిగించే వార్తను చెప్పింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఈ ఐటీ దిగ్గజం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. మీ పోర్ట్ఫోలియోలో విప్రో షేర్లు ఉన్నట్లయితే మీకు కాసుల పంటపండటం ఖాయం. ఈ బైబ్యాక్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
READ ALSO: Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్లో దబిడిదిబిడే..
Also Read
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ఒక్కో షేరు ధర ఎంతంటే..
ఈ బైబ్యాక్ కోసం కంపెనీ ఒక్కో షేరుకు రూ.250 ధరను నిర్ణయించింది. గురువారం షేరు ముగింపు ధర (రూ.210.15)తో పోలిస్తే, విప్రో తన పెట్టుబడిదారులకు సుమారు 19% ప్రీమియంను అందిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే.. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు మీ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ రెడీగా ఉంది. ఈ మొత్తం ప్రక్రియ టెండర్ ఆఫర్ మార్గం ద్వారా జరగనుంది. కంపెనీ ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 600 మిలియన్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన ఈక్విటీలో 5.7 శాతానికి సమానం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిర వాతావరణంలో లాభదాయకమైన ఎగ్జిట్ కోసం చూస్తున్న ఇన్వెటర్లకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ బైబ్యాక్లో అత్యంత ఆసక్తికరమైన, గమనించదగ్గ అంశం ప్రమోటర్ల వాటాకు సంబంధించినది. విప్రో ప్రమోటర్లు (కంపెనీలో 72.6% వాటాను కలిగి ఉన్నవారు) కూడా తమ షేర్లను టెండర్ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విప్రో స్టాక్ 20% కంటే ఎక్కువగా పడిపోయింది. దీర్ఘకాలంలో అంటే గత ఐదేళ్లలో కూడా, ఇది పెట్టుబడిదారులకు 10.42% ప్రతికూల రాబడిని అందించిందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ గతంలో జూన్ 2023లో రూ.12,000 కోట్ల షేర్ల బైబ్యాక్ను నిర్వహించింది. ప్రస్తుతం రూ.2.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న విప్రోకు, ఈ బైబ్యాక్ కేవలం షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ మాత్రమే కాదు, పడిపోతున్న తన స్టాక్ను నిలబెట్టుకోవడానికి, అసంతృప్తిగా ఉన్న పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఇది ఒక కీలక చర్యగా చూస్తుంది.
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!