Wipro Buyback: విప్రో ఇన్వెస్టర్లకు కాసుల పండగే.. రూ.15 వేల కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించిన ఐటీ దిగ్గజం
- రూ.210 విలువైన షేరుకు రూ.250 ఆఫర్
- మొత్తం 600 మిలియన్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wipro Buyback: స్టాక్ మార్కెట్లో నిత్యం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విప్రో ఇన్వెస్టర్లకు కంపెనీ ఒక పెద్ద ఊరట కలిగించే వార్తను చెప్పింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఈ ఐటీ దిగ్గజం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. మీ పోర్ట్ఫోలియోలో విప్రో షేర్లు ఉన్నట్లయితే మీకు కాసుల పంటపండటం ఖాయం. ఈ బైబ్యాక్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
READ ALSO: Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్లో దబిడిదిబిడే..
Also Read
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
ఒక్కో షేరు ధర ఎంతంటే..
ఈ బైబ్యాక్ కోసం కంపెనీ ఒక్కో షేరుకు రూ.250 ధరను నిర్ణయించింది. గురువారం షేరు ముగింపు ధర (రూ.210.15)తో పోలిస్తే, విప్రో తన పెట్టుబడిదారులకు సుమారు 19% ప్రీమియంను అందిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే.. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు మీ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ రెడీగా ఉంది. ఈ మొత్తం ప్రక్రియ టెండర్ ఆఫర్ మార్గం ద్వారా జరగనుంది. కంపెనీ ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 600 మిలియన్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన ఈక్విటీలో 5.7 శాతానికి సమానం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిర వాతావరణంలో లాభదాయకమైన ఎగ్జిట్ కోసం చూస్తున్న ఇన్వెటర్లకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ బైబ్యాక్లో అత్యంత ఆసక్తికరమైన, గమనించదగ్గ అంశం ప్రమోటర్ల వాటాకు సంబంధించినది. విప్రో ప్రమోటర్లు (కంపెనీలో 72.6% వాటాను కలిగి ఉన్నవారు) కూడా తమ షేర్లను టెండర్ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విప్రో స్టాక్ 20% కంటే ఎక్కువగా పడిపోయింది. దీర్ఘకాలంలో అంటే గత ఐదేళ్లలో కూడా, ఇది పెట్టుబడిదారులకు 10.42% ప్రతికూల రాబడిని అందించిందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ గతంలో జూన్ 2023లో రూ.12,000 కోట్ల షేర్ల బైబ్యాక్ను నిర్వహించింది. ప్రస్తుతం రూ.2.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న విప్రోకు, ఈ బైబ్యాక్ కేవలం షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ మాత్రమే కాదు, పడిపోతున్న తన స్టాక్ను నిలబెట్టుకోవడానికి, అసంతృప్తిగా ఉన్న పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఇది ఒక కీలక చర్యగా చూస్తుంది.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!