Gold vs Stocks: “గోల్డ్ కంటే ‘స్మార్ట్’గా పెరిగిన స్టాక్స్ ఇవే! ఈ రెండు షేర్లు కొన్నవారికి కాసుల వర్షం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold vs Stocks: గడిచిన ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ, పసిడి మాత్రం రికార్డు స్థాయి రాబడులతో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ రేసులో బంగారాన్ని మించి లాభాలను పంచిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Rahul Gandhi: ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, బీజేపీ అధికారాన్ని శాశ్వతం చేసే బిల్లు..
Also Read
- EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
నిఫ్టీని వెనక్కి నెట్టిన పసిడి
గత అక్షయ తృతీయ (ఏప్రిల్ 30, 2025) నుంచి ఇప్పటి వరకు విశ్లేషిస్తే, బంగారం సుమారు 62% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్ సూచీ నిఫ్టీ 50 కేవలం 0.7% నామమాత్రపు లాభానికే పరిమితమైంది. దీనిని బట్టి చూస్తే, ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టిన పెట్టుబడే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందని అర్థమవుతోంది. బంగారం 62% పెరిగితే, దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిన స్టాక్స్ కేవలం రెండే ఉన్నాయి.. అవి
అందులో ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్. ఈ స్టాక్ దాదాపు 69% వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో హిండాల్కో ఇండస్ట్రీస్ ఉంది. ఈ మెటల్ దిగ్గజం సుమారు 67.7% లాభపడి రెండో స్థానంలో నిలిచింది. టాటా స్టీల్ (53.8%), భారత్ ఎలక్ట్రానిక్స్ (46%) వంటి దిగ్గజ సంస్థలు కూడా మంచి లాభాలను పంపిణీ చేసినప్పటికీ, బంగారం ఇచ్చిన 62% మార్కును మాత్రం చేరుకోలేకపోయాయి. ఈ రెండు స్టాక్స్ బంగారాన్ని మించి అద్భుతమైన రాబడిని అందించడానికి కారణాలను విశ్లేషిస్తే.. శ్రీరామ్ ఫైనాన్స్ ఎంఎస్ఎంఈ (MSME) రంగంతో పాటు గోల్డ్ లోన్ విభాగంలోకి దూకుడుగా వెళ్లడం కంపెనీకి లాభించింది. దేశీయంగా పెరుగుతున్న రుణ డిమాండ్ ఈ సంస్థ వృద్ధికి ఊతమిచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే హిండాల్కో విషయానికి వస్తే.. అంతర్జాతీయంగా విలువ ఆధారిత లోహాలకు డిమాండ్ పెరగడం, మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడం హిండాల్కో లాభదాయకతను పెంచిందని చెబుతున్నారు.
బంగారం ధర రూ.1.85 లక్షలు..
బంగారం జోరు ఇక్కడితో ఆగేలా లేదు. 2026 నాటికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.85 లక్షల వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో బంగారం అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లలో నమ్మకం సొంతం చేసుకుంది. అయితే సరైన స్టాక్స్ను ఎంచుకుంటే బంగారం కంటే ఎక్కువ లాభాలు గడించవచ్చని శ్రీరామ్ ఫైనాన్స్, హిండాల్కో వంటి సంస్థలు నిరూపించాయి.
READ ALSO: Shefali Bagga: ‘చాహల్ వద్దు.. విరాట్ లాంటి వాడు కావాలి’ మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ..
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..