Business Flash: జొమాటో కిందికి.. జెఫెరీస్ పైకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకి వరుసగా రెండో రోజూ ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల్లో కలిపి ఆ సంస్థ షేర్లు సుమారు 17 శాతం పడిపోయాయి. మొదటి రోజు కన్నా రెండో రోజు మరింత కనిష్టానికి పతనమయ్యాయి. ఏడాది లాకిన్ పీరియడ్ ముగియటంతో షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. బ్రోకరేజ్ సంస్థ జెఫెరీస్ వాటాలు దూసుకుపోయాయి. ఒక షేర్ టార్గెట్ వ్యాల్యూ 100 రూపాయలు కాగా వాటి విలువ 125 శాతానికి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్థను యాజమాన్యం మెరుగైన యూనిట్ ఎకనమిక్స్ వైపు శరవేగంగా నడిపిస్తుండటంతో షేర్లు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి.
read also: AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
ఐటీ ఉద్యోగులు.. వలసలు..
ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో (క్యూ1లో) ఐటీ ఉద్యోగుల వలసలు జోరుగా సాగాయి. ఐటీ జెయింట్ సంస్థ అయిన ఇన్ఫోసిస్ నుంచి 28.4 శాతం ఎంప్లాయ్స్ జంప్ చేశారు. హెచ్సీఎల్ టెక్ నుంచి 23.8 శాతం మంది వెళ్లిపోగా విప్రోని 23.3 శాతం మంది ఉద్యోగులు వీడారు. టీసీఎస్కి 19.7% శాతం మంది టాటా చెప్పారు. ఎక్కువ మంది ఉద్యోగులు వదిలి వెళ్లిన సంస్థ ఇన్ఫోసిస్ అయినప్పటికీ కొత్త ఉద్యోగులు ఎక్కువ మంది చేరింది కూడా ఈ కంపెనీయే కావటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ ఉన్నాయి.
బయోలాజికల్-ఇ 1800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్కి చెందిన బయోలాజికల్-ఇ సంస్థ భారీ పెట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 జీనోమ్ వ్యాలీ యూనిట్ల ఏర్పాటు కోసం రూ.1800 కోట్లు ఖర్చు పెట్టనుంది. ఔషధాల తయారీ సామర్థ్యాన్ని 50 శాతం పెంచుకోవటంపై దృష్టిపెట్టింది. 14 బిలియన్ డోస్లు ఉత్పత్తి చేయాలని తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా స్పెషల్ జనరిక్ ఇంజక్షన్లను, బయోలాజికల్ ఏపీఐలతోపాటు వ్యాక్సిన్లను, ఫార్ములేషన్లను అందుబాటులోకి తేనుంది. మొత్తమ్మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) దిశగా ముందడుగు వేయనుంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోయింది. నిఫ్టి 16,550 పాయింట్లకు దిగువన ట్రేడింగ్ అవుతోంది. ఫార్మా సంస్థల షేర్లు అగ్ర స్థానంలో కొనసాగాయి. బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ నాలుగు శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్, రిలయెన్స్, ఎస్బీఐ తదితర సంస్థలు కూడా లాభాల బాటలో పయనించాయి. రూపాయి మారకం విలువ 79.77 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు వెలువడటంతో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
తాజావార్తలు
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!