Business Flash: 1000 మంది ఉద్యోగులను తీసేయనున్న ఓలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: ఇండియాలోని మల్టీ నేషనల్ రైడ్ షేరింగ్ కంపెనీ అయిన ఓలా.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. సంస్థ పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టిన యాజమాన్యం ఈసారి ఏకంగా 1000 మందిపై వేటు వేయనుందని చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వ్యాపారంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన మేనేజ్మెంట్ ఈ దిశగా నియామకాల్లో దూకుడు పెంచటం గమనార్హం. మొబిలిటీ, హైపర్ లోకల్, ఫిన్టెక్తోపాటు పాత కార్ల వ్యాపార విభాగాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ కార్యాచరణ మరికొద్ది వారాల పాటు కొనసాగనుందని పేర్కొంటున్నారు.
సెల్ఫ్ మేడ్ సంపన్నురాలిగా ఫల్గుణి నాయర్
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
‘నైకా’ ఫౌండర్ ఫల్గుణి నాయర్.. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షాని దాటేశారు. తద్వారా సెల్ఫ్ మేడ్ సంపన్నురాలిగా అగ్రస్థానం ఆక్రమించారు. ఫల్గుణి నాయర్ నికర సంపద రూ.57,520 కోట్లుగా నమోదైంది. కొటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ఈ మేరకు రిపోర్ట్ చేసింది. అత్యంత ధనిక భారతీయ మహిళలతో జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది ఈ లిస్టులోకి కొత్తగా 25 మంది చేరినట్లు వెల్లడించింది. 2021లో కిరణ్ మజుందార్ షా నంబర్-1 ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి ఫల్గుణి నాయర్ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకున్నారు.
read also: What is the value of marriage? : ఇతరుల మోజులో పడి విలువలు కోల్పోతున్నారా? వివాహ బంధానికి విలువేది?
‘టాటా’కి మరిన్ని నష్టాలు
టాటా మోటార్స్ నష్టాలు 5 రెట్లు పెరిగాయి. దీంతో మొత్తం నికర నష్టాలు రూ.4950 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది నష్టం రూ.992 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. తాజా నష్టాలకు చిప్ల కొరత, ఫారెక్స్ నిల్వల్లో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, చైనాలో లాక్డౌన్లే కారణమని తెలిపింది. భారత్లో ప్రయాణికుల వాహనాల విక్రయాలు బాగున్నా అనుబంధ సంస్థ జేఎల్ఆర్ వెహికిల్ సేల్స్లో భారీ పతనం నమోదైనట్లు పేర్కొంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగి 57,376 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 17064 పాయింట్లపైనే కొనసాగుతోంది. అశోక్ లేల్యాండ్ షేర్లు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. త్రైమాసిక ఫలితాల వెల్లడి ముంగిట 6% లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి 9.5 శాతం ప్రాఫిట్ వచ్చింది. తద్వారా 52 వారాల గరిష్టానికి స్టాక్ వ్యాల్యూ చేరుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా షేర్లకు మాత్రమే నష్టాలు వచ్చాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!