Business Flash: 1000 మంది ఉద్యోగులను తీసేయనున్న ఓలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash: ఇండియాలోని మల్టీ నేషనల్ రైడ్ షేరింగ్ కంపెనీ అయిన ఓలా.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. సంస్థ పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టిన యాజమాన్యం ఈసారి ఏకంగా 1000 మందిపై వేటు వేయనుందని చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వ్యాపారంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన మేనేజ్మెంట్ ఈ దిశగా నియామకాల్లో దూకుడు పెంచటం గమనార్హం. మొబిలిటీ, హైపర్ లోకల్, ఫిన్టెక్తోపాటు పాత కార్ల వ్యాపార విభాగాల్లో భారీగా మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ కార్యాచరణ మరికొద్ది వారాల పాటు కొనసాగనుందని పేర్కొంటున్నారు.
సెల్ఫ్ మేడ్ సంపన్నురాలిగా ఫల్గుణి నాయర్
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
‘నైకా’ ఫౌండర్ ఫల్గుణి నాయర్.. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షాని దాటేశారు. తద్వారా సెల్ఫ్ మేడ్ సంపన్నురాలిగా అగ్రస్థానం ఆక్రమించారు. ఫల్గుణి నాయర్ నికర సంపద రూ.57,520 కోట్లుగా నమోదైంది. కొటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ హురున్ ఈ మేరకు రిపోర్ట్ చేసింది. అత్యంత ధనిక భారతీయ మహిళలతో జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది ఈ లిస్టులోకి కొత్తగా 25 మంది చేరినట్లు వెల్లడించింది. 2021లో కిరణ్ మజుందార్ షా నంబర్-1 ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. అయితే ఈసారి ఫల్గుణి నాయర్ ఏకంగా 9 స్థానాలు ఎగబాకి తొలి స్థానానికి చేరుకున్నారు.
read also: What is the value of marriage? : ఇతరుల మోజులో పడి విలువలు కోల్పోతున్నారా? వివాహ బంధానికి విలువేది?
‘టాటా’కి మరిన్ని నష్టాలు
టాటా మోటార్స్ నష్టాలు 5 రెట్లు పెరిగాయి. దీంతో మొత్తం నికర నష్టాలు రూ.4950 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది నష్టం రూ.992 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. తాజా నష్టాలకు చిప్ల కొరత, ఫారెక్స్ నిల్వల్లో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, చైనాలో లాక్డౌన్లే కారణమని తెలిపింది. భారత్లో ప్రయాణికుల వాహనాల విక్రయాలు బాగున్నా అనుబంధ సంస్థ జేఎల్ఆర్ వెహికిల్ సేల్స్లో భారీ పతనం నమోదైనట్లు పేర్కొంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగి 57,376 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 17064 పాయింట్లపైనే కొనసాగుతోంది. అశోక్ లేల్యాండ్ షేర్లు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. త్రైమాసిక ఫలితాల వెల్లడి ముంగిట 6% లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్కి 9.5 శాతం ప్రాఫిట్ వచ్చింది. తద్వారా 52 వారాల గరిష్టానికి స్టాక్ వ్యాల్యూ చేరుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా షేర్లకు మాత్రమే నష్టాలు వచ్చాయి.
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!