5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం ఇవాళ వేలం ప్రారంభమైంది.. తొలిరోజు వేలానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఈ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాతోపాటు ఈసారి అదానీ నెట్వర్క్ కూడా ఈ ఆక్షన్లో ప్రధాన పోటీదారుగా పాల్గొంది.. 5జీ స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనాలు ఉండగా.. ప్రస్తుతం మనం వాడుతున్న 4జీ నెట్వర్క్తో పోల్చితే 5జీ నెట్వర్క్లో పది రెట్లు వేగంగా ఆన్లైన్ సర్వీసులు అందనున్నాయి. ఇవాళ 72 గిగాహెర్జ్ 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం వేలం ప్రారంభం అయ్యింది.. మొదటి రోజున బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటింది అంతే.. 5జీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..
Read Also: Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. తెరవెనుక కుట్ర?
Also Read
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
భారత్ లో టెలికాం స్పెక్ట్రమ్ కోసం ఇంత భారీ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.. వేలంలో.. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ కు చెందిన యాక్టివ్ లీ వంటి సంస్థలు పాల్గొనడంతో అనూహ్యంగా స్పందన వచ్చిందని అంచనా వేస్తున్నారు.. తొలిరోజు వేలంలో నాలుగు రౌండ్లు నిర్వహించామని, బిడ్డింగ్ మొత్తం రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక, బుధవారం ఐదో రౌండ్ వేలం చేపట్టనున్నారు.. అయితే, ఇది అల్ట్రా-హై స్పీడ్లను (4G కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ) అందిస్తుంది. ఉచిత కనెక్టివిటీ, డేటాను పంచుకోవడానికి బిలియన్ల కొద్దీ కనెక్ట్ చేయబడిన పరికరాలను ప్రారంభించవచ్చు. ఐదో రౌండ్ వేలం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్ట్ 15 నాటికి స్పెక్ట్రమ్ కేటాయింపును పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.. 2022 చివరి నాటికి చాలా నగరాల్లో 5జీ సేవలు అందుతాయని వైష్ణవ్ చెప్పారు. 3300 MHz మరియు 26 GHz బ్యాండ్లు బలమైన బిడ్లను ఆకర్షించాయి – మిడ్ మరియు హై-ఎండ్ బ్యాండ్లు ఆసక్తిని కనబరిచాయి. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్కు బిడ్లు కూడా వచ్చాయని మంత్రి విలేకరులకు తెలిపారు. నలుగురు బిడ్డర్లు పాల్గొనడం కలిసే వచ్చే అంశంగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..