AP, Telangana: ఏపీ, తెలంగాణల్లో ‘ఎక్స్పోర్ట్’ ఆఫీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP, Telangana: ఇంటర్నేషనల్ మార్కెట్లలో వైద్య పరికరాల ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యుటికల్స్ డిపార్ట్మెంట్లో భాగంగా పనిచేసే ఈ కౌన్సిల్ హెడ్క్వార్టర్స్ నోయిడాలో ఉంటుందని, బ్రాంచ్ ఆఫీసులు ఏపీ, తెలంగాణల్లో ఉంటాయని పేర్కొంది. మన దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23 వేల 766 కోట్ల రూపాయల విలువైన మెడికల్ డివైజ్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఈ ఎక్స్పోర్టుల విలువ 19 వేల 736 కోట్లు మాత్రమే. బ్రాంచ్ ఆఫీసులను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం పట్ల స్థానిక వాణిజ్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
2 తెలుగు రాష్ట్రాల్లో 78 మంది శ్రీమంతులు
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో 78 మంది సంపన్నులు ఉన్నట్లు IIFL Wealth Hurun India Rich List-2022 తెలిపింది. మినిమం వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగినవాళ్లను మాత్రమే లెక్కలోకి తీసుకొని జాబితాను రూపొందించారు. ఈ లిస్టులో ఉన్న రిచెస్ట్ పర్సన్ల మొత్తం ఆస్తి విలువను 3 లక్షల 90 వేల 500 కోట్ల రూపాయలుగా వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం ఏపీ, తెలంగాణల్లో 11 మంది శ్రీమంతులకు కనీసం 8 వేల కోట్ల రూపాయల చొప్పున ఆస్తులు ఉండటం విశేషం.
read also: Adani, Reliance Pact: ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద.. ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలటానికి వీల్లేదు
‘దొడ్ల’లో ‘భారత్’కు షేరు
ఇటీవలి కాలంలో కరోనా వ్యాక్సిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్.. దొడ్ల డెయిరీ ఈక్విటీలను కొనుగోలు చేసింది. 3 పాయింట్ సున్నా ఏడు శాతం ఈక్విటీలను.. అంటే.. 18 లక్షల 31 వేల 434 షేర్లను సొంతం చేసుకుంది. ఒక్కో స్టాక్ను 525 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన సునిల్రెడ్డి నుంచి సున్నా పాయింట్ మూడు 2 శాతం వాటాలను.. అంటే.. ఒకటీ పాయింట్ తొమ్మిది ఐదు లక్షల షేర్లను పొందింది. ఈ మేరకు 106 కోట్ల రూపాయలకు పైగా చెల్లించినట్లు NSE బ్లాక్డీల్స్ డేటాను బట్టి తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!