Anthropic CEO: సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊస్ట్.. ఆంథ్రోపిక్ సీఈవో హెచ్చరిక..
- ఏఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో వణుకు..
- మరికొన్ని నెలల్లో టెక్కీలను రిప్లేస్ చేసే ఏఐ మోడల్స్..
- ఆంథ్రోపిక్ సీఈవో హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic CEO: టెక్ రంగంలో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆంథ్రోపిక్ సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ షేర్ల పడిపోయేలా చేసింది. దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కుదేలయ్యాయి. భారీ సంపద ఆవిరై పోయింది. ఆంథ్రోపిక్ కంపెనీ తీసుకువచ్చిన క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూర్ టెక్ రంగంలో దుమారాన్ని రేపింది. ఈ ఏఐ మన సిస్టమ్ లోని ఫైళ్లు, పోల్డర్లను యాక్సెస్ చేసి, మనం ఇచ్చే పనుల్ని చక్కపెట్టేస్తోంది. జీతాల లెక్కలు, డేటా అనాలిసిస్, స్టాక్ మార్కెట్ రిపోర్టు , న్యాయపరమైన అంశాలతో కూడిన నివేదిక కావచ్చు, ఏ పనినైనా క్లాడ్ కోవర్క్ ఈజీగా చేయగలదని కంపెనీ చెబుతోంది.
Read Also: టీ20 వరల్డ్కప్కు ముందు Rinku Singhకు షాక్.. సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్!
Also Read
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
ఇదిలా ఉంటే, ఇప్పటికే అనేక ఏఐ టూల్స్తో సాఫ్ట్వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ రాకతో ఈ భయాలు మరింత పెరిగాయి. తాజాగా, ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో 50 శాతం ఎంట్ర లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని చెప్పారు. ఇదే కాకుండా వచ్చే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పూర్తిగా రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ రావచ్చని హెచ్చరించారు. . ఆయన హెచ్చరికల తర్వాత వచ్చిన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కూడా ఇదే తరహా డేటాను చూపిస్తోంది. డిసెంబర్ 2025లో ఉద్యోగావకాశాలు 6.54 మిలియన్లకు పడిపోయాయని చెప్పింది. సెప్టెంబర్ 2020 తర్వాత ఇదే అత్యల్పం అని నివేదిక చెబుతోంది.
టెక్ రంగంలో ఏఐ పురోగతి అనుకున్న దానికన్నా చాలా వేగంగా పెరుగుతోందని దామోడీ వెల్లడించారు. ఇది మనుషులు చేసే పనికి సామాన్య ప్రత్యామ్నాయం అవుతోందని అన్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్ రంగాల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసిపారేస్తున్నాయి. అమెజాన్ ఇటీవల భారీ లేఆఫ్స్ ప్రకటించింది. రానున్న రోజుల్లో టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తీసివేత కార్యక్రమాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే టెక్కీల్లో భయాలు పెరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!