Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!
- నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను
- దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది..
- అందుకే నేను కుప్పకూలిపోకుండా లేచి ముందుకు సాగాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal: వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన కుమారుడి మరణం తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకుంటూ ‘ఇండియా టుడే కాన్క్లేవ్ 2026’లో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తన ఏకైక కుమారుడిని కోల్పోయినా, దేశాభివృద్ధి కోసం తన పయనాన్ని ఆపనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దగ్గర అపారమైన అవకాశాలు ఉన్నాయని, స్వయం సమృద్ధి దిశగా మనం అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
READ ALSO: Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
Also Read
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ (49) ఇటీవల న్యూయార్క్లో స్కీయింగ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వేదాంత గ్రూప్లో అగ్నివేష్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషాదంపై స్పందిస్తూ అగర్వాల్ కన్నీటి పర్యంతమయ్యారు. “నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను. ఈ ఘటన తర్వాత నేను కుప్పకూలిపోవాలి లేదా లేచి నిలబడి ముందుకు సాగాలి. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నా గుండెల్లో భారతదేశం ఉంది. దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ అనుభవం నన్ను నిడరంగా మార్చింది, ఇప్పుడు నాకు దేనికీ భయం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ విద్య కంటే స్వదేశీ విద్యే మిన్న!
భారతదేశం నుంచి ఏటా సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడంపై అనిల్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే అవకాశాలు ఉన్నాయని, యువతకు ఇక్కడే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. “మన దేశంలోని యువత, మహిళలు, రిటైర్డ్ సైనిక అధికారులకు సరైన అవకాశాలు ఇస్తే భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్కు అవసరమైన చమురు డిమాండ్లో 90% దిగుమతుల ద్వారానే తీరుతోందని, దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నా విధానపరమైన అనుమతుల జాప్యం వల్ల వెలికితీత సాధ్యం కావడం లేదని అన్నారు. మధ్యప్రాచ్య దేశాలు భారత్ ఎప్పుడూ తమపై ఆధారపడాలని కోరుకుంటున్నాయని, భారత్ స్వయం సమృద్ధి సాధించడాన్ని అవి ఇష్టపడటం లేదని అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశీయ ఇంధన వనరులను విస్తరించడం అత్యవసరమని, తక్షణమే విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
READ ALSO: Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!