Amul Milk Prices: మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul Milk Prices: గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. ‘అమూల్’ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాల్టి (సోమవారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమూల్ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో ధరలను సవరించింది. GCMMF ప్రకారం.. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగా ధరలను సవరించవలసి ఉంటుంది. దాని అనుబంధ పాల సంఘాలు గత ఏడాది కాలంలో రైతులకు 6-8 శాతం నష్టపరిహారాన్ని పెంచాయని పేర్కొంది. అయితే.. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది.
Read also: Hyderabad Wall Collapse: నాణ్యత లేకుండా నిర్మించిన గోడే చిన్నారుల మృతికి కారణం!
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
దీంతో.. అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. తాజా పెంపుతో అమూల్ గేదె పాల ధర లీటరు రూ.73కి చేరింది. అర లీటరు రూ.27 అయింది. అమూల్ బంగారం ధర రూ.66 నుంచి రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి పెరిగింది. అమూల్ తాజా పాల ధర లీటరు రూ.56కు, అరలీటర్ రూ.28కి పెరిగింది. అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్కు రూ.34, అమూల్ శక్తి అర లీటర్కు రూ.30గా ఉంది. గతంలో అమూల్ పాల ధరలు పెరిగినప్పుడు ఇతర కంపెనీలు కూడా పెంచాయి. ఇప్పుడు కూడా ఈ గుజరాతీ కంపెనీని ఇతర కంపెనీలు అనుసరిస్తే వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
Read also: Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
2023 ఫిబ్రవరి తర్వాత అమూల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ అయిన GCMMF సాధారణంగా పాల ధరల పెంపును ముందుగానే ప్రకటిస్తుంది. అయితే తాజాగా నేరుగా పాల ధరను పెంచేసి ధరలను ప్రకటించింది. దాంతో అమూల్ పాల వినియోగదారులపై లీటరుకు రూ.2 భారం పడనుంది. పశుగ్రాసంతో పాటు పాల ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పాల ధరను పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంఆర్పీని కేవలం 3-4 శాతం మాత్రమే పెంచామని జిసిఎంఎంఎఫ్ తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకే ధరలు పెంచామని స్పష్టం చేసింది.

Amul
Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!