Amul Milk Prices: మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul Milk Prices: గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. ‘అమూల్’ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాల్టి (సోమవారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమూల్ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో ధరలను సవరించింది. GCMMF ప్రకారం.. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగా ధరలను సవరించవలసి ఉంటుంది. దాని అనుబంధ పాల సంఘాలు గత ఏడాది కాలంలో రైతులకు 6-8 శాతం నష్టపరిహారాన్ని పెంచాయని పేర్కొంది. అయితే.. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది.
Read also: Hyderabad Wall Collapse: నాణ్యత లేకుండా నిర్మించిన గోడే చిన్నారుల మృతికి కారణం!
Also Read
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
- Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
దీంతో.. అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. తాజా పెంపుతో అమూల్ గేదె పాల ధర లీటరు రూ.73కి చేరింది. అర లీటరు రూ.27 అయింది. అమూల్ బంగారం ధర రూ.66 నుంచి రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి పెరిగింది. అమూల్ తాజా పాల ధర లీటరు రూ.56కు, అరలీటర్ రూ.28కి పెరిగింది. అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్కు రూ.34, అమూల్ శక్తి అర లీటర్కు రూ.30గా ఉంది. గతంలో అమూల్ పాల ధరలు పెరిగినప్పుడు ఇతర కంపెనీలు కూడా పెంచాయి. ఇప్పుడు కూడా ఈ గుజరాతీ కంపెనీని ఇతర కంపెనీలు అనుసరిస్తే వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
Read also: Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
2023 ఫిబ్రవరి తర్వాత అమూల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ అయిన GCMMF సాధారణంగా పాల ధరల పెంపును ముందుగానే ప్రకటిస్తుంది. అయితే తాజాగా నేరుగా పాల ధరను పెంచేసి ధరలను ప్రకటించింది. దాంతో అమూల్ పాల వినియోగదారులపై లీటరుకు రూ.2 భారం పడనుంది. పశుగ్రాసంతో పాటు పాల ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పాల ధరను పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంఆర్పీని కేవలం 3-4 శాతం మాత్రమే పెంచామని జిసిఎంఎంఎఫ్ తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకే ధరలు పెంచామని స్పష్టం చేసింది.

Amul
Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!