Amul Milk Prices: మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul Milk Prices: గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. ‘అమూల్’ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాల్టి (సోమవారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమూల్ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో ధరలను సవరించింది. GCMMF ప్రకారం.. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగా ధరలను సవరించవలసి ఉంటుంది. దాని అనుబంధ పాల సంఘాలు గత ఏడాది కాలంలో రైతులకు 6-8 శాతం నష్టపరిహారాన్ని పెంచాయని పేర్కొంది. అయితే.. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది.
Read also: Hyderabad Wall Collapse: నాణ్యత లేకుండా నిర్మించిన గోడే చిన్నారుల మృతికి కారణం!
Also Read
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
దీంతో.. అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. తాజా పెంపుతో అమూల్ గేదె పాల ధర లీటరు రూ.73కి చేరింది. అర లీటరు రూ.27 అయింది. అమూల్ బంగారం ధర రూ.66 నుంచి రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి పెరిగింది. అమూల్ తాజా పాల ధర లీటరు రూ.56కు, అరలీటర్ రూ.28కి పెరిగింది. అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్కు రూ.34, అమూల్ శక్తి అర లీటర్కు రూ.30గా ఉంది. గతంలో అమూల్ పాల ధరలు పెరిగినప్పుడు ఇతర కంపెనీలు కూడా పెంచాయి. ఇప్పుడు కూడా ఈ గుజరాతీ కంపెనీని ఇతర కంపెనీలు అనుసరిస్తే వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
Read also: Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
2023 ఫిబ్రవరి తర్వాత అమూల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ అయిన GCMMF సాధారణంగా పాల ధరల పెంపును ముందుగానే ప్రకటిస్తుంది. అయితే తాజాగా నేరుగా పాల ధరను పెంచేసి ధరలను ప్రకటించింది. దాంతో అమూల్ పాల వినియోగదారులపై లీటరుకు రూ.2 భారం పడనుంది. పశుగ్రాసంతో పాటు పాల ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పాల ధరను పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంఆర్పీని కేవలం 3-4 శాతం మాత్రమే పెంచామని జిసిఎంఎంఎఫ్ తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకే ధరలు పెంచామని స్పష్టం చేసింది.

Amul
Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!