Amul Milk Prices: మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul Milk Prices: గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. ‘అమూల్’ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాల్టి (సోమవారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమూల్ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో ధరలను సవరించింది. GCMMF ప్రకారం.. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగా ధరలను సవరించవలసి ఉంటుంది. దాని అనుబంధ పాల సంఘాలు గత ఏడాది కాలంలో రైతులకు 6-8 శాతం నష్టపరిహారాన్ని పెంచాయని పేర్కొంది. అయితే.. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది.
Read also: Hyderabad Wall Collapse: నాణ్యత లేకుండా నిర్మించిన గోడే చిన్నారుల మృతికి కారణం!
Also Read
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
దీంతో.. అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. తాజా పెంపుతో అమూల్ గేదె పాల ధర లీటరు రూ.73కి చేరింది. అర లీటరు రూ.27 అయింది. అమూల్ బంగారం ధర రూ.66 నుంచి రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి పెరిగింది. అమూల్ తాజా పాల ధర లీటరు రూ.56కు, అరలీటర్ రూ.28కి పెరిగింది. అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్కు రూ.34, అమూల్ శక్తి అర లీటర్కు రూ.30గా ఉంది. గతంలో అమూల్ పాల ధరలు పెరిగినప్పుడు ఇతర కంపెనీలు కూడా పెంచాయి. ఇప్పుడు కూడా ఈ గుజరాతీ కంపెనీని ఇతర కంపెనీలు అనుసరిస్తే వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
Read also: Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
2023 ఫిబ్రవరి తర్వాత అమూల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ అయిన GCMMF సాధారణంగా పాల ధరల పెంపును ముందుగానే ప్రకటిస్తుంది. అయితే తాజాగా నేరుగా పాల ధరను పెంచేసి ధరలను ప్రకటించింది. దాంతో అమూల్ పాల వినియోగదారులపై లీటరుకు రూ.2 భారం పడనుంది. పశుగ్రాసంతో పాటు పాల ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పాల ధరను పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంఆర్పీని కేవలం 3-4 శాతం మాత్రమే పెంచామని జిసిఎంఎంఎఫ్ తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకే ధరలు పెంచామని స్పష్టం చేసింది.

Amul
Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
తాజావార్తలు
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!