Amul Milk Prices: మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు.. లీటరుకు ఎంతంటే..
Amul Milk Prices: గుజరాత్కు చెందిన పాల కంపెనీ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. ‘అమూల్’ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అన్ని రకాల ఉత్పత్తుల ధరలను రూ.2 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు ఇవాల్టి (సోమవారం) ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమూల్ చివరిసారిగా ఫిబ్రవరి 2023లో ధరలను సవరించింది. GCMMF ప్రకారం.. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చుల పెరుగుదల కారణంగా ధరలను సవరించవలసి ఉంటుంది. దాని అనుబంధ పాల సంఘాలు గత ఏడాది కాలంలో రైతులకు 6-8 శాతం నష్టపరిహారాన్ని పెంచాయని పేర్కొంది. అయితే.. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది.
Read also: Hyderabad Wall Collapse: నాణ్యత లేకుండా నిర్మించిన గోడే చిన్నారుల మృతికి కారణం!
Also Read
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
దీంతో.. అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. తాజా పెంపుతో అమూల్ గేదె పాల ధర లీటరు రూ.73కి చేరింది. అర లీటరు రూ.27 అయింది. అమూల్ బంగారం ధర రూ.66 నుంచి రూ.68కి, అమూల్ శక్తి రూ.60కి పెరిగింది. అమూల్ తాజా పాల ధర లీటరు రూ.56కు, అరలీటర్ రూ.28కి పెరిగింది. అమూల్ గోల్డ్ హాఫ్ లీటర్కు రూ.34, అమూల్ శక్తి అర లీటర్కు రూ.30గా ఉంది. గతంలో అమూల్ పాల ధరలు పెరిగినప్పుడు ఇతర కంపెనీలు కూడా పెంచాయి. ఇప్పుడు కూడా ఈ గుజరాతీ కంపెనీని ఇతర కంపెనీలు అనుసరిస్తే వినియోగదారులపై మరింత భారం పడుతుంది.
Read also: Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
2023 ఫిబ్రవరి తర్వాత అమూల్ పాల ధరలను పెంచడం ఇదే తొలిసారి. గుజరాత్ రాష్ట్రంలోని పాల సహకార సంఘాల అపెక్స్ బాడీ అయిన GCMMF సాధారణంగా పాల ధరల పెంపును ముందుగానే ప్రకటిస్తుంది. అయితే తాజాగా నేరుగా పాల ధరను పెంచేసి ధరలను ప్రకటించింది. దాంతో అమూల్ పాల వినియోగదారులపై లీటరుకు రూ.2 భారం పడనుంది. పశుగ్రాసంతో పాటు పాల ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో పాల ధరను పెంచుతూ అమూల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఎంఆర్పీని కేవలం 3-4 శాతం మాత్రమే పెంచామని జిసిఎంఎంఎఫ్ తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకే ధరలు పెంచామని స్పష్టం చేసింది.

Amul
Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!