Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మంగళవారం తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్పెయిడ్’ పేరిట ఒక వినూత్న సేవను ప్రారంభించింది. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని, అత్యంత నమ్మకమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ సేవను రూపొందించారు. అడ్వాన్స్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవను భారత్లో ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్గా ఎయిర్టెల్ నిలిచింది.
నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏమిటి?
ఇది ఒక అధునాతన నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా టెలికాం ఆపరేటర్లు ఒకే ఫిజికల్ నెట్వర్క్ను ఒకటి కంటే ఎక్కువ వర్చువల్ నెట్వర్క్లుగా విభజించగలరు. దీనివల్ల ప్రతి వినియోగదారుడికి నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ‘ఫాస్ట్లేన్ కనెక్టివిటీ’ అందుబాటులో ఉంటుంది.
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
సాధారణంగా జనాభా ఎక్కువగా ఉండే మార్కెట్లు లేదా ట్రాఫిక్ జామ్లలో నెట్వర్క్ సిగ్నల్ పడిపోతుంటుంది. కానీ.. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఎంతటి రద్దీ వాతావరణంలో ఉన్నా కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి నెట్వర్క్ డ్రాప్స్ ఎదుర్కోరు. ఈ మొబైల్-ఓన్లీ సర్వీస్ అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్గా ఈ కొత్త సేవకు అప్గ్రేడ్ అవుతారు. రూ. 449 ప్రారంభ ధర కలిగిన ఇండివిడ్యువల్ ప్లాన్తో సహా అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లపై ఇది వర్తిస్తుంది. అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, 3,000 SMSలతో పాటు ఫ్రాడ్ డిటెక్షన్, స్పామ్ అలర్ట్ వంటి సాధారణ ప్రయోజనాలు కూడా ఇందులో లభిస్తాయి.
యాక్సెస్ ఎలా పొందాలి?
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు లేదా కొత్తగా ఈ సేవలోకి మారాలనుకునే వారు ‘ఎయిర్టెల్ థాంక్స్’ యాప్ ద్వారా లేదా సమీపంలోని రిటైల్ స్టోర్లను సందర్శించి పోస్ట్పెయిడ్కు మారవచ్చు. అయితే.. ఈ ప్రయారిటీ సేవలు కేవలం ‘5G స్టాండ్అలోన్’ సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లలో మాత్రమే పనిచేస్తాయి.
“ట్రాఫిక్లో క్లయింట్ కాల్స్ మాట్లాడినా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో స్ట్రీమింగ్ చేసినా.. మార్కెట్లో క్యాబ్ బుక్ చేసుకున్నా వినియోగదారులకు అత్యుత్తమ నెట్వర్క్ అనుభూతిని అందించడమే మా లక్ష్యం” అని ఎయిర్టెల్ ఇండియా ఎండి అండ్ సీఈఓ శాశ్వత్ శర్మ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: టీ20 ముంబై లీగ్లో క్రీడాస్ఫూర్తి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను సహచరుడికి ఇచ్చేసిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Peddi : ‘పెద్ది’ టికెట్ రేట్ల తగ్గింపు… ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!