Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మంగళవారం తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం ‘ప్రయారిటీ పోస్ట్పెయిడ్’ పేరిట ఒక వినూత్న సేవను ప్రారంభించింది. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేని, అత్యంత నమ్మకమైన కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా ఈ సేవను రూపొందించారు. అడ్వాన్స్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సేవను భారత్లో ప్రవేశపెట్టిన మొదటి టెలికాం ఆపరేటర్గా ఎయిర్టెల్ నిలిచింది.
నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏమిటి?
ఇది ఒక అధునాతన నెట్వర్క్ ఆర్కిటెక్చర్. దీని ద్వారా టెలికాం ఆపరేటర్లు ఒకే ఫిజికల్ నెట్వర్క్ను ఒకటి కంటే ఎక్కువ వర్చువల్ నెట్వర్క్లుగా విభజించగలరు. దీనివల్ల ప్రతి వినియోగదారుడికి నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ‘ఫాస్ట్లేన్ కనెక్టివిటీ’ అందుబాటులో ఉంటుంది.
Also Read
- Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
- EXPLAINER: పెట్రోల్, ఇథనాల్లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
సాధారణంగా జనాభా ఎక్కువగా ఉండే మార్కెట్లు లేదా ట్రాఫిక్ జామ్లలో నెట్వర్క్ సిగ్నల్ పడిపోతుంటుంది. కానీ.. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఎంతటి రద్దీ వాతావరణంలో ఉన్నా కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ వినియోగంలో ఎలాంటి నెట్వర్క్ డ్రాప్స్ ఎదుర్కోరు. ఈ మొబైల్-ఓన్లీ సర్వీస్ అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్గా ఈ కొత్త సేవకు అప్గ్రేడ్ అవుతారు. రూ. 449 ప్రారంభ ధర కలిగిన ఇండివిడ్యువల్ ప్లాన్తో సహా అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లపై ఇది వర్తిస్తుంది. అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కాలింగ్, 3,000 SMSలతో పాటు ఫ్రాడ్ డిటెక్షన్, స్పామ్ అలర్ట్ వంటి సాధారణ ప్రయోజనాలు కూడా ఇందులో లభిస్తాయి.
యాక్సెస్ ఎలా పొందాలి?
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు లేదా కొత్తగా ఈ సేవలోకి మారాలనుకునే వారు ‘ఎయిర్టెల్ థాంక్స్’ యాప్ ద్వారా లేదా సమీపంలోని రిటైల్ స్టోర్లను సందర్శించి పోస్ట్పెయిడ్కు మారవచ్చు. అయితే.. ఈ ప్రయారిటీ సేవలు కేవలం ‘5G స్టాండ్అలోన్’ సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లలో మాత్రమే పనిచేస్తాయి.
“ట్రాఫిక్లో క్లయింట్ కాల్స్ మాట్లాడినా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో స్ట్రీమింగ్ చేసినా.. మార్కెట్లో క్యాబ్ బుక్ చేసుకున్నా వినియోగదారులకు అత్యుత్తమ నెట్వర్క్ అనుభూతిని అందించడమే మా లక్ష్యం” అని ఎయిర్టెల్ ఇండియా ఎండి అండ్ సీఈఓ శాశ్వత్ శర్మ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Avor Electric Bike: భారత్లోకి త్వరలో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. 5kWh బ్యాటరీ, AI ఫీచర్లతో ఆకట్టుకోనున్న కొత్త మోడల్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
Old smartphone: ఇంట్లో పడి ఉన్న పాత స్మార్ట్ఫోన్ను ఇలా కూడా వాడొచ్చు.. బోలెడు డబ్బు ఆదా.. మీ ఇంటిని కాపాడుతుంది!
-
Devajit Saikia: వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన బీసీసీఐ.. కార్యదర్శి దేవజిత్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?