“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్-5” ఆదివారం రాత్రి అద్భుతంగా పూర్తయ్యింది. బిగ్ ఫిల్మ్ స్టార్స్ ఎంట్రీతో గ్రాండ్ గా ఫైనల్స్ ను నిర్వహించారు మేకర్స్. అయితే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పెద్దగా అవకాశాలేమీ రావని అంటున్నారు. దానికి నిదర్శనంగా గత సీజన్ల కంటెస్టెంట్స్ గురించి చెబుతారు. మూడు సీజన్ల విన్నర్స్ సైతం ఎక్కడా కన్పించట్లేదు. తాజా సీజన్ ఇంకా పూర్తి కాకముందే కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు రావడం చూస్తుంటే ఈ నెగెటివ్ టాక్ కు బ్రేక్ పడేలా కన్పిస్తోంది.
Read Also :
Also Read
‘బిగ్ బాస్’ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కు కొత్త అవకాశాలను అందించడంలో ఈ షో సహాయపడుతుందని అంటారు. కష్టాల్లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు తమ కెరీర్లో ఎదగడానికి బిగ్ బాస్ వేదికపై కొత్త ఇమేజ్ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ టీవీ షో ఐదవ సీజన్లో పాల్గొన్న ఇద్దరు సెలబ్రిటీలు క్రేజీ ఆఫర్లను కొట్టారు. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో భాగంగా ‘బిగ్ బాస్’ వేదికపై హోస్ట్ నాగార్జునతో కంటెస్టెంట్ లోబో తాను మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్నట్లు వెల్లడించాడు. “భోళా శంకర్”లో ఆయనతో నటించే అవకాశం చిరంజీవి కల్పించారని లోబో వెల్లడించాడు. హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే లోబో చిరంజీవిని కలిశాడు. షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే.
Read Also :
మరోవైపు అనారోగ్యంతో మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిన మోడల్ జెస్సి సైతం క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో జెస్సీకి లీడ్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందని వెల్లడించాడు. “ఇంటి నుండి బయటకి వచ్చిన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నేను కథానాయకుడిగా నటించే చిత్రం కోసం నన్ను సంప్రదించారు” అని జెస్సీ నాగార్జునతో అన్నారు. ఇక శ్వేతా వర్మ, ప్రియాంక సింగ్, ఇతరులు తమకు కూడా ఆఫర్లు వస్తున్నాయని వెల్లడించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!