Bigg Boss Telugu 7: ఓటింగ్ లో దూసుకుపోతున్న కామన్ మ్యాన్ .. ఆ ఇద్దరు అవుటేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ ఏడోవారం నామినేషన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. అందరు కలిసి భోలే ను టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేశారు.. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఒకసారి చూస్తే..
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సత్తా చాటుతున్నాడు.. ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు.. ఒకవైపు విమర్శలు అందుకున్నా మరోవైపు వరుసగా క్రేజ్ ను పెంచుకుంటున్నాడు.. అతని మీద సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్లో అతనికి ఉన్న ఆదరణ ఇవేమీ తగ్గించలేకపోతున్నాయని ఓటింగ్ చూస్తే అర్థం అవుతుంది. ఏకంగా 42 శాతానికి పైగా ఓట్లు పల్లవి ప్రశాంత్ కి పోల్ అయ్యాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. ప్రశాంత్ తర్వాత అమర్ దీప్ ఉన్నాడు. అతడికి దాదాపు 19 శాతం ఓట్లు వచ్చాయట. అనూహ్యంగా మూడో స్థానంలో భోలే షావలి కొనసాగుతున్నాడట. అతడికి 12 శాతానికి పైగా ఓట్లు వచ్చాయట. హౌస్ మొత్తం అతను అర్హుడు కాదని తేల్చిన నేపథ్యంలో బహుశా జనాలలో సింపథీ పెరిగి ఉండే అవకాశం ఉండొచ్చు..
Also Read
ఇక మొత్తానికి పాతవాళ్లు సేఫ్ లో ఉన్నారు.. కొత్తగా వచ్చిన ఆ ఇద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు..అశ్విని ఆరో స్థానంలో ఉండగా పూజా మూర్తి కేవలం 2 శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉందట. అశ్వినికి 5 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. మరి ఇదే సరళి శుక్రవారం వరకు కొనసాగితే పూజా మూర్తి ఇంటి నుండి వెళ్ళిపోనుంది. గత ఆరు వారాల్లో అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు… వీకెండ్ లోపు ఏదైనా జరగొచ్చు.. చివరికి ఎవరు వెళ్తారో చూడాలి..
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!