బిగ్ బాస్ సీజన్ ఏడోవారం నామినేషన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. అందరు కలిసి భోలే ను టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేశారు.. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఒకసారి చూస్తే..
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సత్తా చాటుతున్నాడు.. ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు.. ఒకవైపు విమర్శలు అందుకున్నా మరోవైపు వరుసగా క్రేజ్ ను పెంచుకుంటున్నాడు.. అతని మీద సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అయితే ప్రేక్షకుల్లో అతనికి ఉన్న ఆదరణ ఇవేమీ తగ్గించలేకపోతున్నాయని ఓటింగ్ చూస్తే అర్థం అవుతుంది. ఏకంగా 42 శాతానికి పైగా ఓట్లు పల్లవి ప్రశాంత్ కి పోల్ అయ్యాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. ప్రశాంత్ తర్వాత అమర్ దీప్ ఉన్నాడు. అతడికి దాదాపు 19 శాతం ఓట్లు వచ్చాయట. అనూహ్యంగా మూడో స్థానంలో భోలే షావలి కొనసాగుతున్నాడట. అతడికి 12 శాతానికి పైగా ఓట్లు వచ్చాయట. హౌస్ మొత్తం అతను అర్హుడు కాదని తేల్చిన నేపథ్యంలో బహుశా జనాలలో సింపథీ పెరిగి ఉండే అవకాశం ఉండొచ్చు..
ఇక మొత్తానికి పాతవాళ్లు సేఫ్ లో ఉన్నారు.. కొత్తగా వచ్చిన ఆ ఇద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు..అశ్విని ఆరో స్థానంలో ఉండగా పూజా మూర్తి కేవలం 2 శాతం ఓట్లతో ఏడో స్థానంలో ఉందట. అశ్వినికి 5 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. మరి ఇదే సరళి శుక్రవారం వరకు కొనసాగితే పూజా మూర్తి ఇంటి నుండి వెళ్ళిపోనుంది. గత ఆరు వారాల్లో అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు… వీకెండ్ లోపు ఏదైనా జరగొచ్చు.. చివరికి ఎవరు వెళ్తారో చూడాలి..