డబ్బులు అవసరమైతే డబ్బులను ఎక్కడైనా అప్పుగా డబ్బులను తీసుకుంటారు.. ఇక కొంతమంది లోన్స్ తీసుకుంటారు. కారణం ఏదైనా డబ్బులు తీసుకుంటే శనిదేవుడ అనుగ్రహం ఉంటేనే ఆ అప్పు తీరుతుంది..శనీశ్వరుని అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం.. శనీశ్వరుడిని పూజించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది ఈరోజుల్లో అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా అప్పులు, వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఓ వ్యక్తి సామాన్యంగా అప్పులు చేయడు. పరిస్థితులు అప్పులపాలు చేస్తాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు రుణం తీసుకోకూడదు.. తీర్చడానికి చాలా కష్టపడాలి.. అలాగే ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు, గురు భగవానుడు సర్ప గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఎప్పుడూ రుణం తీసుకోకూడదు.. రుణం త్వరగా తీర్చడానికి పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లగ్నానికి అధిపతి ఆరవ ఇంట్లో శత్రుత్వం కలిగి ఉన్నట్లయితే, లేదా అతను దుష్ట గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే రుణ సమస్యలు ఉంటాయి. ఆ కాలంలో ఇబ్బందులు తప్పవు. ఆదివారం రాహుకాలం సమయం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల మధ్య శివాలయంలోని భైరవ సన్నిధికి వెళ్లి కొద్దిగా శుభ్రమైన తెల్లటి గుడ్డలో 27 ఎండుమిర్చి వేసి మట్టి దీపంలో ఆ ముడి వేసి కొబ్బరినూనె పోసి దీపం వెలిగించి పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కుంకుమ పెట్టాలి. మూడు వారాలు ఈ పూజ చేస్తే అప్పుల ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు..
ఇకపోతే రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం. శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించి పూజిస్తే అప్పుల బాధలు తీరుతాయి. అలాగే తమిళనాడులో శనిక్షేత్రం తిరునల్లారులో శనిభగవానుడిని దర్శించుకుంటే శని బాధలు తగ్గిపోతాయి..అనుగ్రహం కలుగుతుంది.. అప్పుడు మనకు ఎటువంటి బాధలు ఉండవు..